E-Paper
Advertisement

Delhi Air Emergency : శ్వాస ఆగుతోంది మహాప్రభూ.. రోడ్డెక్కిన దిల్లీవాసులు.. పిల్లలు, మహిళలు సైతం అరెస్ట్?

Delhi Air Emergency : శ్వాస ఆగుతోంది మహాప్రభూ.. రోడ్డెక్కిన దిల్లీవాసులు.. పిల్లలు, మహిళలు సైతం అరెస్ట్?
Advertisement

Delhi Air Emergency : దిల్లీలో పొగ మంచు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వాయు కాలుష్యంతో గాలి నాణ్యత తగ్గిపోతుంది. దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. శ్వాసకోశ సమస్యలు తీవ్రమవుతున్నాయని ఇండియా గేట్ వద్ద స్థానికులు ఆదివారం “క్లీన్ ఎయిర్” నిరసన చేపట్టారు. “ఎయిర్ ఎమర్జెన్సీ” తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిరసనకారుల అరెస్టు

కొంతమంది మహిళలు తమ చిన్నారులతో కలిసి నెబ్యులైజర్లు, వైద్య ప్రిస్క్రిప్షన్లు పట్టుకుని నిరసన తెలిపారు. దిల్లీ నగరంలో కాలుష్య సంక్షోభం తీవ్రమవుతుందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.
‘మేము ఊపిరి పీల్చుకోలేకపోతున్నాము’ అంటూ ఇండియా గేట్ వద్ద దిల్లీవాసులు ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ.. నిరసనకారులపై దాడి చేయడం అమానుషం అన్నారు.

Advertisement

నిరసనలను జంతర్ మంతర్‌కు మార్చాలని ఆందోళనకారులను కోరినట్లు పోలీసులు తెలిపారు. అందుకు నిరసనకారులు అంగీకరించకుండా, మాన్ సింగ్ రోడ్డును దిగ్బంధించారన్నారు. దీంతో తాము జోక్యం చేసుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని, రోడ్డును క్లియర్ చేశామని డీసీపీ దేవేష్ కుమార్ మహలా తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన వారిని మాత్రమే అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఆ తరువాత వారిని విడుదల చేశారని చెప్పారు.

స్వచ్ఛమైన గాలి ప్రాథమిక హక్కు

దిల్లీలో వాయు కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇండిపెండెంట్ సంస్థను ఏర్పాటు చేయాలని, రియల్-టైమ్ గాలి నాణ్యత డేటా, కాలుష్యం పెరిగే సమయంలో స్పష్టమైన ఆరోగ్య సలహాలు, కాలుష్యాన్ని పరిష్కరించడానికి నిధులు కేటాయించాలని దిల్లీవాసులు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం స్వచ్ఛమైన గాలి, జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని తెలిపారు. దిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని కాపాడటానికి దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

ఇవాళ్టి ఏక్యూఐ స్థాయిలు

సోమవారం దిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు 11.6°Cలకు పడిపోయాయి. గాలి నాణ్యత చాలా తీవ్రంగా ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సోమవారం ఉదయం 6.05 గంటలకు ఇచ్చిన డేటా ప్రకారం వాయు నాణ్యత సూచిక (AQI) 346 రికార్డు అయింది. దిల్లీలోని చాలా ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా ఉన్నాయి. బవానాలో అత్యధికంగా AQI 412గా నమోదు అయింది. తరువాత వజీర్‌పూర్ (397), జహంగీర్‌పురి (394), నెహ్రూ నగర్ (386) ఉన్నాయి. సగటున 370 AQI రికార్డు అవుతుంది. అక్టోబర్ 30 తర్వాత ఈ సీజన్‌లో ఇది రెండో అత్యల్ప రీడింగ్ ను తాకింది.

Also Read: UP Lovers Incident: UPలో దారుణం.. లవర్‌ను గన్‌తో కాల్చి.. తర్వాత ప్రియుడు కూడా..

దేశ రాజధాని దిల్లీకి సమీపంలోని పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. దిల్లీలో PM 2.5 స్థాయిలు తక్కువగా నమోదు అవుతున్నాయి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×