E-Paper
Advertisement

Cyclone : తుపాన్ తీవ్రరూపం.. ఆ 3 రాష్ట్రాలకు హెచ్చరిక..

Cyclone : తుపాన్ తీవ్రరూపం.. ఆ 3 రాష్ట్రాలకు హెచ్చరిక..
Advertisement

Cyclone : అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను తీవ్రరూపం దాలుస్తోంది. మరో 24 గంటల్లో మరింత తీవ్రంగా మారుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతుందని తెలిపింది. తుపాను ప్రస్తుతం గోవాకు పశ్చిమాన 690 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముంబైకి పశ్చిమ-నైరుతి దిశలో 640 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

తుపాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఈదురు గాలులు బలంగా వీస్తాయని హెచ్చరించింది. భారీ అలల కారణంగా గుజరాత్‌లోని పర్యాటక ప్రదేశం తితాల్‌ బీచ్‌ను ఈ నెల 14 వరకు మూసివేశారు.

Advertisement

జూన్‌ 10 నుంచి 12 వరకు తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో
45 నుంచి 55 కిలోనాట్స్‌ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. గాలుల వేగం 65 కిలోనాట్స్‌ వరకు పెరగవచ్చని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్లే అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×