E-Paper
Advertisement

Covid Update: తెలంగాణలో కరోనా పాగా.. కొత్తగా 6 కేసులు.. దేశంలో ఎన్నంటే ?

Covid Update: తెలంగాణలో కరోనా పాగా.. కొత్తగా 6 కేసులు.. దేశంలో ఎన్నంటే ?
Advertisement

Covid Update: తెలంగాణ కరోనా మళ్లీ పాగా వేసింది. కొత్తవేరియంట్ JN1 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఆరోగ్యశాఖ విడుదల చేసిన కొవిడ్ బులెటిన్ లో తెలంగాణలో కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనే 6 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

కరీంనగర్ జిల్లాలో 4 పాజిటివ్ కేసులను గుర్తించారు. ఒక మహిళతో పాటు 18 నెలల బాలుడికి కరోనా పాజిటివ్ గా నిర్థారణయింది. మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కొత్త వేరియంట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 600కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ప్రస్తుతం భారత్ లో 4440 పాజిటివ్ కేసులున్నాయి. ఇక మంగళవారం ఒక్కరోజే 5 మంది కరోనాతో చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇప్పటివరకూ JN1 వేరియంట్ కేసులు 312 బయటపడ్డాయి. కేరళలో 147, గోవాలో 51, గుజరాత్ లో 34, మహారాష్ట్రలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్ లో 5, తెలంగాణలో 2, ఒడిశాలో 1 కొత్తవేరియంట్ కేసులున్నాయి. 10 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో కొత్తవేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×