E-Paper
Advertisement

Colored Papad: కలర్ పాపడ్‌లకు చెక్.. బ్యాన్ చేసిన విజయ్ సర్కార్, అధిక మోతాదులో రసాయనాలు!

Colored Papad: కలర్ పాపడ్‌లకు చెక్.. బ్యాన్ చేసిన విజయ్ సర్కార్, అధిక మోతాదులో రసాయనాలు!
Advertisement

Colored Papad: విజయ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కలర్ పాపడ్లు రంగురంగుల అప్పడాలపై బ్యాన్ చేసింది. వీటిని తిని పిల్లలు తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో అధిక మోతాదులో కృత్రిమ రంగులు కలిపిన రంగుల పాపడ్‌ల అమ్మకాలపై నిషేధం విధించింది తమిళనాడు ఆహార శాఖ.

కలర్ పాపడ్‌లకు చెక్-ఏ వస్తువు పట్టుకున్నా కల్తీ లేకుంటే రసాయనాలు. అరటిపండు మొదలు అప్పడాల వరకు ఇదే పరిస్థితి. కల్తీన బారినపడి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు సామాన్యులు. ఆహారపు అలవాట్లలో అప్పడాలకు ప్రత్యేక స్థానం ఉంది. దేశవ్యాప్తంగా ఇళ్లు, రెస్టారెంట్లలో భోజనంతోపాటు అప్పడాలను కచ్చితంగా తింటారు. ఈ మధ్యకాలంలో రంగుల్లో పాపడ్లను సైతం వడ్డిస్తున్నారు.

Advertisement

బ్యాన్ చేసిన విజయ్ సర్కార్-మరికొందరు తయారు చేసి అమ్ముతున్నారు కూడా. హిందీలో పాపడ్ అని పిలుస్తారు. తమిళంలో అప్పళం అంటారు. తెలుగులో చిన్న గొట్టాలు అంటారు. వీటిని పప్పు లేదా బియ్యపు పిండితో తయారు చేస్తారు. సాధారణంగా ఫ్రైయమ్ కంటే పలుచగా ఉంటాయి. ఫ్రైయమ్‌ను బంగాళదుంప పిండి లేదా సగ్గుబియ్యం  నుండి తయారు చేస్తారని చెబుతున్నారు.

అధిక మోతాదులో రసాయనాలు! పిండిలో కొద్ది మొత్తంలో రసాయనాలు కలపడం వల్ల రంగులు వస్తాయి. ఆ తర్వాత ఆవిరి మీద ఉడికిస్తారు. ఆ తర్వాత ఎండలో ఆరబెడతారు. ఇలాంటి రంగుల పాపడ్‌లను తరచుగా తినడం వల్ల జీర్ణ సమస్యలు, కిడ్నీ దెబ్బతినడం, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని తమిళనాడు ఆహార భద్రతా విభాగం తెలిపింది. పిల్లలలో అలర్జీలు, ఏకాగ్రత లోపానికి కారణమవుతాయని పేర్కొంది.

Advertisement

వీటికి ప్రత్యామ్నాయంగా మినప పప్పు లేదా బియ్యంతో తయారు చేసిన పాపడ్‌లను ఎంచుకోవాలని సూచించారు. నిషేధిత లేదా అధిక మోతాదులో ఉండే రంగులను కలపడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని తమిళనాడు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ హెచ్చరించింది.

ALSO READ: నీట్ యూజీ-2026 ఫలితాలు.. 11.21 లక్షల మంది క్వాలిఫై, హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంక్

ఈ క్రమంలో తమిళనాడు ఆహార భద్రతా విభాగం.. కృత్రిమ రంగులు కలిపిన పాపడ్ తయారీ, నిల్వ, పంపిణీ  అమ్మకాలను నిషేధించింది. గతంలో పానీ పూరీలో రసాయనాలు వినియోగించినట్టు తేలడంతో అధికారులు దాడులు చేశారు.  అది కాస్తా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇప్పుడు పాపడ్‌ల వంతైంది. మొత్తానికి ఆహార పదార్ధాలు  అయితే కల్తీ, లేకుంటే రసాయనాల మయంగా మారాయని అంటున్నారు సామాన్యులు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×