E-Paper
Advertisement

ఎన్డీయేను గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారు.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

ఎన్డీయేను గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారు.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

MK Stalin: త‌మిళ‌నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వంపై ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ దేశంలో మళ్ళీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే, రాష్ట్రాల అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్రం పేరును కూడా మార్చే ప్రమాదం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఆస‌క్తిని రేపుతున్నాయి.

తమిళనాడు సంస్కృతి, భాష, చరిత్రను దెబ్బతీయడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని స్టాలిన్ ఆరోపించారు. “బీజేపీ అధికారంలోకి వస్తే కేవలం పరిపాలన మార్పు మాత్రమే కాదు, మన రాష్ట్రం పేరును కూడా మార్చేస్తారు. తమిళనాడును వారు కేవలం ఒక భూభాగంగా చూస్తారు తప్ప, మన భాషా ప్రాతిపదికన ఏర్పడిన అస్తిత్వాన్ని గౌరవించరు.” అని ఆయన విమర్శించారు. గతంలో గవర్నర్ తమిళగం అనే పదాన్ని ప్రస్తావించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. బీజేపీ మన రాష్ట్రం పేరులోని నాడు (దేశం/నేల) అనే పదాన్ని తొలగించాలని చూస్తోందని దుయ్యబట్టారు.

Advertisement

సమాఖ్య వ్యవస్థను అణిచివేసి, దేశమంతటా ఒకే దేశం, ఒకే భాష అనే ఏకపక్ష విధానాన్ని రుద్దాలని ఎన్డీయే చూస్తోందని స్టాలిన్ అన్నారు. ద్రవిడ మోడల్ పాలనను దెబ్బతీయడానికి కేంద్రం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని, నిధుల కేటాయింపులో కూడా వివక్ష చూపుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను కాపాడుకోవాలంటే ఎన్డీయేను గద్దె దించడమే ఏకైక మార్గమని ఆయన పిలుపునిచ్చారు.

తమిళ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించే శక్తులకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని స్టాలిన్ ఓటర్లను కోరారు. ఇది కేవలం అధికారం కోసం జరుగుతున్న పోరాటం కాదని, తమిళనాడు భవిష్యత్తు మరియు గుర్తింపును కాపాడుకునే యుద్ధమని ఆయన అభివర్ణించారు. “మన పేరు, మన భాష, మన హక్కులు మన దగ్గరే ఉండాలంటే ఇండియా (INDIA) కూటమిని గెలిపించండి.” అని స్టాలిన్ స్పష్టం చేశారు.

Advertisement

Read Also: మోదీ, పినరయి ఇద్దరూ ఒక్కటే.. కేర‌ళ‌లో కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలుపు

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×