E-Paper
Advertisement

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ..

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ..
Advertisement

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలులో అర్వింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసందే. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో శనివారం కేజ్రీవాల్‌ను  హాజరు పరచడగా కోర్టు మూడు రోజుల సీబీఐ రిమాండ్ విధించింది.

ఇవాల్టితో మూడు రోజుల సీబీఐ రిమాండ్ ముగియటంతో అధికారులు మరోసారి కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరిచారు. విచారణ కోసం మరో రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీ పొడగించాలని కోర్టును సీబీఐ కోరింది. దీంతో కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జూలై 12 వరకు కేజ్రీవాల్ రిమాండ్ కొనసాగనుంది.

Advertisement

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌ను 14 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీబీఐ చేసిన విజ్ఞప్తికి కోర్టు అంగీకారం తెలిపింది,

విచారణ సమయంలో కేజ్రీవాల్ సరిగా సహకరించలేదని సీబీఐ రిమాండ్ దరఖాస్తులో కోర్టుకు వెల్లడించింది. నేరం నుంచి తప్పించుకునేందుకు సాక్ష్యాలకు విరుద్ధంగా కేజ్రీవాల్ సమాధానాలు ఇచ్చారని అంతేకాకుండా కొన్నింటికి అసలు సమాధానం చెప్పలేదని తెలిపింది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని తెలిపింది. దీంతో కేజ్రీవాల్ ను మరికొన్ని రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది.

Advertisement

Also Read: నీట్‌ పీజీ నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కీలక వ్యాఖ్యలు

సీబీఐ అభ్యర్థనను పరిశీలించిన ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్ ను జూలై 12 వరకు జుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఆయనను జూలై 12 రోజున కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. కేజ్రీవాల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ అభ్యర్థించిన కొన్ని గంటలకే ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో కోర్టు అనుమతితో సీబీఐ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది.

 

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×