E-Paper
Advertisement

Indian Railways: మన దేశంలోని ఈ రైల్వే స్టేషన్‌లో అడుగుపెట్టాలంటే పాస్‌పోర్టు, వీసా ఉండాల్సిందే

Indian Railways: మన దేశంలోని ఈ రైల్వే స్టేషన్‌లో అడుగుపెట్టాలంటే పాస్‌పోర్టు, వీసా ఉండాల్సిందే
Advertisement

Pakistan Visa: ఎవరికైనా పాస్‌పోర్టు, వీసా ఎప్పుడు అవసరముంటుంది? వేరే దేశానికి వెళ్లితేనే కదా! కానీ, భారత్‌లోనే ఉండే ఈ రైల్వే స్టేషన్‌లో మాత్రం ప్రయాణికులు తప్పనిసరిగా పాస్‌పోర్టు, వీసా తీసుకెళ్లాలి. లేదంటే.. ఆ స్టేషన్‌లో అడుగుపెట్టనివ్వరు. అంతేకాదు, ఈ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ జవాన్లతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. నిత్యం సీసీటీవీల నిఘా నీడలో ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్‌లోకి కనీసం పోర్టర్లను కూడా అనుమతించరు. ఎవరి లగేజీ వారే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంతటి కఠినమైన నిబంధనలు ఉన్నా.. ఈ రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసా?

ఈ రైల్వే స్టేషన్ నార్తర్న్ రైల్వేలోని ఫిరోజ్‌పూర్ డివిజన్‌లో ఈ రైల్వే స్టేషన్ ఉన్నది. అదే పంజాబ్‌లోని అత్తారి శ్యాం సింగ్ రైల్వే స్టేషన్‌. ఇది ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య వ్యూహత్మక ప్రాంతంలో ఉండటం చేత ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అమృత్‌సర్ – లాహోర్ లైన్‌లో భారత్ వైపున్న చివరి రైల్వే స్టేషన్ ఇది.

Advertisement

ఉభయ దేశాల మధ్య సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రజలు తమ ప్రయాణాలు చేసేవారు. రెండు దేశాలను కలిపే ఈ ఎక్స్‌ప్రెస్.. ఉభయ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తడంతో నిలిచిపోయింది. ఈ ఎక్స్‌ప్రెస్ సేవలు అందించినప్పుడు ఈ అత్తారి రైల్వే స్టేషన్‌లోనే ప్రయాణాన్ని ప్రారంభించేది. ఈ రైల్వే స్టేషన్‌ను ఫిరోజ్‌పూర్ డివిజన్ నిర్వహిస్తుంది.

Also Read: Anchor Shyamala: యాంకర్ శ్యామలకు మాజీ సీఎం జగన్ బంపర్ ఆఫర్.. రాష్ట్రస్థాయిలో పదవి

Advertisement

2022లో ఈ విషయాన్ని అమృత్ మహోత్సవ్ కూడా ట్విట్టర్‌లో షేర్ చేసింది. భారత్‌లోనే ఉండే ఓ రైల్వే స్టేషన్‌లో అడుగు పెట్టాలంటే భారతీయులకు వీసా ఉండాలని మీకు తెలుసా? అంటూ ట్వీట్ చేసింది. అమృత్‌సర్‌లోని ఈ రైల్వే స్టేషన్‌లో అడుగు పెట్టాలంటే భారతీయులకు కూడా కచ్చితంగా వీసా ఉండాలని పేర్కొంది. కాగా, ఈ పోస్టు కింద ఓ నెటిజన్ కీలక కామెంట్ చేశాడు. పాకిస్తాన్‌ వైపు కూడా ఇలాంటి రైల్వే స్టేషన్ ఉన్నదని పేర్కొన్నాడు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×