E-Paper
Advertisement

మిడ్ డే మీల్స్‌లో చికెన్ బిర్యానీ.. విద్యార్థులకు పండగే, ఎక్కడో తెలుసా?

మిడ్ డే మీల్స్‌లో చికెన్ బిర్యానీ..  విద్యార్థులకు పండగే, ఎక్కడో తెలుసా?
Advertisement

Vijay Govt: పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు విజ‌య్ ప్ర‌భుత్వం కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా అమలవుతున్న మిడ్ డే మీల్స్ పథకంలో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ ఇచ్చే అంశాన్ని పరిశీలన చేస్తోంది. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ పథకంలో ముఖ్యమైన మార్పు కానుంది.

విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం! దేశంలోని అన్ని రాష్ట్రాలు మిడ్ డే మీల్స్ పథకాన్ని దాదాపుగా అమలు చేస్తున్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అందులోని మెనూ మార్చుతున్నాయి. ఈ విషయంలో ఒక్కో రాష్ట్ర ఒక్కోలా ప్లాన్ చేస్తోంది. ఒకరు వారానికి ఒక్క గుడ్డు పెడుతుంటే, మరొకరు రెండు సార్లు ఇస్తున్నారు. వీటన్నింటికి వినూత్నంగా ఆలోచన చేస్తోంది విజయ్ ప్రభుత్వం.

Advertisement

మిడ్ డే మీల్స్‌లో చికెన్ బిర్యానీ- వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించే అంశాన్ని పరిశీలన చేస్తోంది. ఈ ప్రతిపాదనను ఇప్పటికే సీఎం విజయ్ ముందు ఉంచామని, అది పరిశీలనలో ఉందన్నారు  పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్. ఆగస్టు 5న జరగనున్న రాష్ట్ర బడ్జెట్‌కు ముందు మంగళవారం చెన్నైలోని అన్నా శతాబ్ది గ్రంథాలయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

రేపో మాపో విజయ్ ప్రభుత్వం నిర్ణయం- వాళ్లు లేవనెత్తిన డిమాండ్లలో చికెన్ బిర్యానీ అంశం ఒకటి. ఈ సందర్భంగా వారానికి ఒకసారి విద్యార్థులకు చికెన్ బిర్యానీ విషయాన్ని తీసుకొచ్చారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న సాంఘిక సంక్షేమ-మహిళా సాధికారత శాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement

డ్రాపౌట్లు తగ్గుతాయా?వారానికి ఒకసారి ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్ బిర్యానీ ఇవ్వడం వల్ల విద్యార్థుల ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నది ప్రభుత్వం ఆలోచన. అంతేకాదు విద్యార్థుల సంక్షేమం, పాఠశాలల్లో హాజరు శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.  చికెన్ బిర్యానీ కంటే తొలుత పాఠశాలలకు సరఫరా చేసే బియ్యం నాణ్యత మెరుగు పరిచే అంశంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది.

ALSO READ: నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు, ఇక  ఫాస్ట్ ట్రాక్ కోర్టు వంతు

తమిళనాడులో  ఒకటి నుంచి 10వ తరగతి వరకు దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారంతా మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. సీఎం అల్పాహార పథకం  ఒకటి నుంచి 8వ తరగతి వరకు 32 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోంది.మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ విద్యార్థుల వరకు విస్తరిస్తే మరో 8  లక్షల మంది దీని పరిధిలోకి వస్తారని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.  ఆగష్టు మొదటివారంలోపు చికెన్ బిర్యానీ అంశంపై విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×