E-Paper
Advertisement

Chennai Techie Suicide: చిన్నారి తల్లిని చంపేసిన సోషల్‌మీడియా.. ఎందుకు.. ఏం జరిగింది..?

Chennai Techie Suicide: చిన్నారి తల్లిని చంపేసిన సోషల్‌మీడియా.. ఎందుకు.. ఏం జరిగింది..?
Advertisement

Chennai Techie Suicide after Being Shamed Online: సోషల్‌మీడియాలో నెటిజన్ల వ్యవహారశైలితో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకుంది. 8 ఎనిమిది నెలల చిన్నారిని అనాధను చేసింది. దీనికి కారణం నెటిజన్లా? ముమ్మాటికీ అవుననే సమాధానం వస్తోంది. అసలేం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే..

తమిళనాడుకి చెందిన 33 ఏళ్ల రమ్య అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకుంది. సోషల్‌మీడియాలో తనను ట్రోల్ చేయడంతో అవమానం తట్టుకోలేకపోయింది. ఈ విషయంలో తోటి ఉద్యోగుల నుంచి అదే పరిస్థితి ఎదురైంది. అందరూ ఆమెని నిందితురాలిగా చూడడం తట్టుకోలేకపోయింది. దీనికి పరిష్కారం తన చావే కారణమని భావించింది.

Advertisement

కట్టుకున్న భర్త, చివరకు పేరెంట్స్‌కు మనసు విప్పి తన బాధను చెప్పలేదు. భర్త ఇంటి నుంచి పేరెంట్స్ వద్దకు వచ్చింది. తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో సూసైడ్ చేసుకుని ఈ లోకాన్ని విడిచి పెట్టింది. 9 నెలల బేబిని అనాథను చేసింది. దీనికి పాపం ఎవరిది..? అనే ప్రశ్న రైజ్ అవుతోంది.

Also Read: బెంగుళూరులో రేవ్ పార్టీ, టాలీవుడ్ నటీనటులు, ఏపీ మంత్రి కారు కూడా..

Advertisement

నెలరోజుల కిందట వెనక్కి వెళ్తే.. చెన్నైలోని వీజీఎన్ స్టాఫర్డ్ అపార్టుమెంట్ నాలుగో ఫ్లోరులో వెంకటేష్-రమ్య దంపతులు ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. బాబుకు నాలుగేళ్లు కాగా, బేబీకి ఏడు నెలల పసికందు. అయితే ఏప్రిల్ 28న రూఫ్‌పై ఏడేళ్ల చిన్నారి ప్రమాదకర స్థితిలో చిక్కుకుంది.

చుట్టుపక్కల అపార్టుమెంట్ వాళ్ల చూసి చాకచక్యంగా బేబిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. సరిగ్గా ఘటన జరిగిన నెలరోజులకు చిన్నారి తల్లి సూసైడ్ చేసుకుంది. తన అజాగ్రత్త వల్లే చిన్నారి రూఫ్‌పై చిక్కుకోవడంతో సోషల్‌మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో రమ్య మానసిక వేదనకు గురైంది. ఎవరికీ చెప్పుకోలేకపోయింది. ట్రోలింగ్ భూతం నుంచి బయట పడలేకపోయింది. చివరకు తాను చేసిన తప్పుకు చావు పరిష్కారమని భావించి సూసైడ్ చేసుకుంది.

 

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×