E-Paper
Advertisement

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం
Advertisement

Center Scrap Selling: స్క్రాప్ తో కేంద్రానికి భారీ ఆదాయం వచ్చింది. గత నెలలో భారీ క్లీన్ నెస్ డ్రైవ్‌లో భాగంగా కేంద్రం స్క్రాప్‌ను అమ్మింది. ఈ స్క్రాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ. 800 కోట్లు ఆదాయం సమకూరింది. ఇది రూ.615 కోట్ల వ్యయంతో చంద్రునిపై విజయవంతంగా దిగిన చంద్రయాన్-3 బడ్జెట్‌ కంటే అధికం. 2021లో ప్రారంభమైన వార్షిక క్లీన్ నెస్ డ్రైవ్ నుంచి, ఈ సంవత్సరం వరకు స్క్రాప్ అమ్మకం ద్వారా ప్రభుత్వం దాదాపు రూ.4,100 కోట్లకు పైగా ఆదాయం పొందింది. ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి 31 మధ్య జరిగిన ఈ డ్రైవ్ లో ఇప్పటి వరకు గరిష్టంగా 232 లక్షల చదరపు అడుగుల ప్రభుత్వ కార్యాలయ స్థలాలను క్లీన్ చేయగా వీటిల్లో 29 లక్షలకు పైగా పాత ఫైళ్లను తొలగించారు. ఈ డ్రైవ్ లో దాదాపు 11.58 లక్షల కార్యాలయాలను కవర్ చేయనున్నారు.

ఐదేళ్లలో రూ.4097 కోట్లు

పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో విదేశాలలోని పలు మిషన్లు సహా 84 మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఈ క్లీన్ నెస్ డ్రైవ్ ప్రోగ్రామ్ చేపట్టారు. ముగ్గురు సీనియర్ మంత్రులు, మన్సుఖ్ మాండవీయ, కె.రామ్ మోహన్ నాయుడు, జితేంద్ర సింగ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2021 నుంచి 2025 వరకు కేంద్రం ఐదుసార్లు భారీ క్లీన్ నెస్ డ్రైవ్ ప్రోగ్రామ్స్ చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, పెండింగ్‌ ఫైళ్ల భారాన్ని తగ్గించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో ‘స్వచ్ఛత’ ప్రచారం కింద 23.62 లక్షల కార్యాలయాలను కవర్ చేశారు. వీటిల్లో 928.84 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేయడం, 166.95 లక్షల ఫైళ్లను తొలగించడం చేశారు. ఈ స్క్రాప్ ద్వారా రూ.4,097.24 కోట్లు ఆదాయం పొందింది.

Advertisement

Also Read: Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×