E-Paper
Advertisement

Amit Shah : “వయనాడ్ విపత్తుపై ముందే హెచ్చరించాం”

Amit Shah : “వయనాడ్ విపత్తుపై ముందే హెచ్చరించాం”
Advertisement

Home Minister Amit Shah on Wayanad Tragedy : వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 180 మంది మరణించగా 130 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మృతుల్లో 75 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యలో వర్షం పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

తాజాగా వయనాడ్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. కేరళలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై రాజ్యసభలో ఓ ప్రకటన చేశారాయన. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ముందే హెచ్చరించామని, జూలై 23నే అప్రమత్తం చేసినా.. కేరళ ప్రభుత్వం మాత్రం తమ రాష్ట్ర పౌరులను సకాలంలో తరలించలేదని తెలిపారు. కేరళలో భారీవర్షాలు మొదలవ్వగానే 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించామని చెప్పారు.

Advertisement

Also Read : వయనాడ్ వెళ్తుండగా మంత్రి కారుకి ప్రమాదం.. స్వల్ప గాయాలు

ప్రకృతి వైపరీత్యాల గురించి వారంరోజుల ముందుగానే హెచ్చరించే వ్యవస్థ భారత్ లో ఉందన్నారాయన. ప్రపంచంలో ఇలాంటి సాంకేతికత ఉన్న 4 దేశాల్లో మనదేశం ఒకటని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కేరళకు చేరుకున్న వెంటనే అప్రమత్తమై.. ఆ ప్రాంతవాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లైతే.. వయనాడ్ ఇంతటి విషాదాన్ని చూసేది కాదన్నారు అమిత్ షా. ఈ ప్రమాదంతో తీరని విషాదంలో ఉన్న కేరళ ప్రజలకు.. మోదీ సర్కార్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×