E-Paper
Advertisement

Delhi: ఎబోలా‌పై కేంద్రం హెచ్చరికలు.. ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో అడ్వైజరీ జారీ

Delhi: ఎబోలా‌పై కేంద్రం హెచ్చరికలు.. ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో అడ్వైజరీ జారీ
Advertisement

Delhi: ప్రపంచ ఆరోగ్య సంస్థ -WHO ఎబోలా హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సూచన చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులు, ఓడరేవులకు హెచ్చరిక జారీ చేసింది.

ప్రపంచ ఆరోగ్య శాఖ హెచ్చరికతో ఎబోలా‌పై కేంద్రం అప్రమత్తం

Advertisement

ఎబోలా లక్షణాలు కోసం పటిష్టమైన స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని ఉత్తర్వులు పేర్కొంది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, సుడాన్ దేశాలలో ఆయా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. భారత్‌లో ఎబోలా కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది. ఎబోలా వైరస్ వ్యాధి కి సంబంధించి చర్యలు అంచనా వేయడానికి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీవాస్తవ అధ్యక్షతన సమావేశం జరిగింది.

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ కార్యదర్శులు హాజరయ్యారు. అన్ని స్థాయిలలో సన్నద్ధతను కొనసాగించాలని ఆరోగ్య శాఖ సూచన చేసింది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చినవారు మొదలు స్క్రీనింగ్, క్వారంటైన్ ప్రోటోకాల్‌లు, కేసుల నిర్వహణ, రెఫరల్ వ్యవస్థలు, ప్రయోగశాల పరీక్షలకు సంబంధించిన విధానాలను ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పంచుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.

Advertisement

ఎబోలా పై హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

2014లో ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో భారత్ విజయవంతమైంది. ఎబోలా సోకినవారికి జ్వరం, నీరసం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇప్పటివరకు కాంగోలోని ఇటూరి, నార్త్ కివు ఉత్తర ప్రావిన్సులలో 51 కేసులు నమోదు అయ్యాయి. ఉగాండాలో రెండు కేసులు నిర్ధారించారు. ఈ వ్యాప్తికి సంబంధించి 139 అనుమానిత మరణాలు, దాదాపు 600 అనుమానిత కేసులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వైరస్ కట్టడికి టీకాలు ఏవీ అందుబాటులో లేవు. వీటిపై ప్రయోగాలు జరుగుతున్నాయి.

ALSO READ: మోదీ కేబినెట్ భేటీ.. మంత్రివర్గంలో మార్పులు-చేర్పులు, వారికి మాత్రమే చోటు

పలు దేశాల్లో ఎబోలా కేసులు కలకలం రేపుతున్న నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ నుంచి వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యానికి సంబంధించి చిన్న సమస్యలు కనిపిస్తే వెంటనే ఎయిర్‌పోర్టు వైద్యసిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రయాణం చేసిన 21 రోజుల్లోగా వ్యాధి లక్షణాలు కనిపిస్తే స్థానిక వైద్య అధికారులకు తెలియజేయాలని సూచించారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×