E-Paper
Advertisement

Central Cabinet Decisions: కేబినెట్ మీటింగ్‌లో కేంద్రం కీలక నిర్ణయాలు.. ఢిల్లీ మెట్రో విస్తరణకు ఆమోదం!

Central Cabinet Decisions: కేబినెట్ మీటింగ్‌లో కేంద్రం కీలక నిర్ణయాలు.. ఢిల్లీ మెట్రో విస్తరణకు ఆమోదం!
Advertisement

Central Cabinet Decisions

Central Cabinet Decisions before Lok Sabha Elections: లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి.. కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో.. ఢిల్లీ మెట్రో విస్తరణకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. అదనంగా 20 కిలోమీటర్ల మెట్రో కారిడార్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

Advertisement

ఢిల్లీ మెట్రో ఫేజ్IV ప్రాజెక్టుల రెండు కారిడార్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు కారిడార్లకు 8,399 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ రెండు కారిడార్ల దూరం 20.762 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్టు మార్చి 2029 నాటికి పూర్తవుతుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

Also Read: ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన మాజీ సీఎం.. లోక్ సభ బరిలోకి దిగుతారా ?

Advertisement

లజపత్ నగర్ నుంచి సాకేత్ జీ-బ్లాక్, ఇందర్ లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకూ రెండు కారిడార్లకు ఆమోదం తెలిపారు. ఈ కొత్త మెట్రో లైన్ సిల్వర్, మెజెంటా, పింక్ వైలెట్ లైన్లను కనెక్ట్ చేయనుంది. మొత్తం 8 స్టేషన్లను నిర్మించనున్నారు. మొత్తం ఇందర్ లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకూ 12.377 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ ఉండనుంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×