E-Paper
Advertisement

Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రూ.54,926 కోట్లతో కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్, ఇందులో ఏమున్నాయంటే?

Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రూ.54,926 కోట్లతో కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్, ఇందులో ఏమున్నాయంటే?
Advertisement

భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సుమారు రూ. 54,926 కోట్ల విలువైన నాలుగు ప్రధాన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు.

ఈ నిర్ణయాల్లో భాగంగా ‘భారత్ ఆద్యోగిక్ వికాస్ యోజన’ పథకానికి పెద్దపీట వేశారు. ఈ బృహత్తర ప్రాజెక్టు కోసం రూ. 33,660 కోట్లు కేటాయించారు. దీనివల్ల పారిశ్రామిక రంగంలో భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నూతన పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం అవుతుంది. దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెరిగి ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

Advertisement

రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చాటుతూ పత్తి రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 పత్తి సీజన్‌కు సంబంధించి కనీస మద్దతు ధర (MSP) రీయింబర్స్ మెంట్ కోసం రూ. 11,712 కోట్లు కేటాయించింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది రైతులకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా కేంద్రం భరోసా కల్పించింది.

రవాణా సౌకర్యాల మెరుగుదలలో భాగంగా నేషనల్ హైవే-927 విస్తరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. బారాబంకి నుండి బహ్రైచ్ సెక్షన్ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి రూ. 6,969 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ రహదారి అభివృద్ధి చెందడం వల్ల ప్రయాణ సమయం తగ్గుతుంది. వాణిజ్య పరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు మార్గం సుగమం అవుతుంది. ప్రాంతీయ అనుసంధానత మెరుగుపడి సామాన్యులకు రవాణా కష్టాలు తప్పుతాయి.

Advertisement

ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్రం మరో అడుగు వేసింది. చిన్న జల విద్యుత్ అభివృద్ధి పథకం కోసం రూ. 2,585 కోట్లు కేటాయించారు. పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఇంధన అవసరాలను తీర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధులతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిన్న తరహా జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ సరఫరాకు ఇది ఎంతో దోహదపడుతుంది.

ALSO READ: LPG Shortage: దేశంలో LPG కొరత లేదు.. 40% ఎల్పీజీ ప్రొడక్షన్ పెంచాం, ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు: కేంద్రం

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×