E-Paper
Advertisement

Ayodhya : శ్రీ రాముడి ప్రాణప్రతిష్ట.. వీఐపీల సందడి..

Ayodhya : శ్రీ రాముడి ప్రాణప్రతిష్ట.. వీఐపీల సందడి..
Advertisement

Ayodhya : అయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దశాబ్ధాల కాలంగా ఎదురుచూస్తున్న రామ మందిరం కల సాకారంకానుండటంతో.. దేశమంతా రామజపం పఠిస్తోంది. మరి కొద్ది గంటల్లో అయోధ్యలో మహత్తర ఘట్టమైన ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరగుతున్న ఈ మహోత్సవానికి అన్ని రంగాల ప్రముఖులకు ఆహ్వానించింది అయోధ్య ట్రస్ట్‌. దీంతో అమృత ఘడియల్లో రామయ్య కొలువుదీరే సన్నివేశాన్ని కనులారా తిలకించేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు.

మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు జరిగే ఈ ప్రాణప్రతిష్ట వేడుకలో ప్రధాని మోదీ సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులంతా పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ వేడుక కోసం ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నటి కంగనా రనౌత్ , అలియా భట్ , అక్షయ్ కుమార్ , అనుపమ్ ఖేర్ , సంజయ్ లీలా బన్సాలీ, అమితాబ్ బచ్చన్ , చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్ వంటి అనేక మంది భారతీయ నటులకు ఆహ్వానాలు అందాయి. రణదీప్ హుడా, సోనూ నిగమ్, అనుపమ్ ఖేర్, షెఫాలీ షా వంటి పలువురు ప్రముఖులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. అలాగే ప్రాణప్రతిష్టను చూసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు అయోధ్యకు చేరుకున్నారు. వీరి వెంట ఏపీకి చెందిన పలువురు నేతలు కూడా వెళ్లారు.

Advertisement

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా అయోధ్య బాట పట్టడంతో ఆ ప్రాంతమంతా వీవీఐపీ గెస్టులతో సందడి నెలకొంది. వీరి భద్రతా నేపథ్యంలో అయోధ్యలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తీవ్రవాదుల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆలయ పరిసరాల్లో మొత్తం 13 వేల మందికిపైగా ఖాఖీలు మోహరించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×