E-Paper
Advertisement

Karnataka : క్యాంపు రాజకీయాలు షురూ..! కాంగ్రెస్ అప్రమత్తం..

Karnataka : క్యాంపు రాజకీయాలు షురూ..! కాంగ్రెస్ అప్రమత్తం..
Advertisement

Karnataka election result live : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం ఖాయమైపోయింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి విజయం సాధించబోతోంది. మేజిక్ ఫిగర్ మాట ఇక అవసరంలేదు. కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం మరింత అప్రమత్తమైంది. ఆపరేషన్‌ కమలం ప్రభావం పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే చర్యలు చేపట్టింది.

గెలుపొందిన ఎమ్మెల్యేలను తమిళనాడు తరలించేందుకు కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోందని సమాచారం. ఈ విషయంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రికి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పరిస్థితులను బట్టి అక్కడ నుంచి తమిళనాడు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

హంగ్ వస్తుందేమోనన్న అంచనాతో తొలుత బీజేపీ క్యాంపు రాజకీయాలకు తెరతీసే యోచన చేసింది. జేడీఎస్ తో మంతనాలు ప్రారంభించింది. నేరుగా అమిత్ షా రంగంలోకి చర్చలు మొదలుపెట్టారు. కానీ కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ తర్వాత బీజేపీ వెనక్కి తగ్గింది. ఓటమిని అంగీకరిస్తూ సీఎం బసవరాజ్ బొమ్మై స్వయంగా ప్రకటన చేశారు.

కర్ణాటకలో భారీ విజయం ఖాయమైన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఆదివారం మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం నిర్వహించే యోచన చేస్తోంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×