E-Paper
Advertisement

Patna Boat Capsize: గంగా నదిలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు..

Patna Boat Capsize: గంగా నదిలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు..
Advertisement

Boat Capsize in Patna: బీహార్‌లోని పాట్నాలో విషాదం చోటుచేసుకుంది. రాజధాని నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్హ్ పట్టణ సమీపంలోని గంగా నదిలో పడవ బోల్తా పడింది. మొత్తం 17 మంది ఈ పడవలో ప్రయాణిస్తుండగా పడవ బోల్తా పడింది.

దీంతో అందులోని 11 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన ఆరుగురు గల్లంతైనట్లు సమాచారం. బార్హ్ ఉమానాథ్ ఘాట్ నుండి డయారాకు ప్రయాణిస్తోన్న సమయంలో పడవ బోల్తా పడిందని గల్తంతైన వారికోసం అన్వేషణ జరుగుతోందని అధికారులు తెలిపారు.

Advertisement

గత నెల ప్రారంభంలో బీహార్‌లోని మహావీర్ తోలా గ్రామ సమీపంలో గంగా నదిలో పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు అదృశ్యమైన తర్వాత ఆదివారం ఈ సంఘటన జరిగింది.

Advertisement

ఉమానాథ్ గంగా ఘాట్ సమీపంలో ఉదయం 9.15 గంటలకు ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ప్రయాణిస్తున్న పడవ మార్గమధ్యంలో బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగిందని బార్హ్ సబ్ డివిజనల్ ఆఫీసర్ శుభం కుమార్ తెలిపారు.

సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్‌లు ప్రారంభించి, బోటులో గల్లంతైన వారి ఆచూకీని కనిపెట్టినట్లు ఎస్‌డీఎం తెలిపారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×