E-Paper
Advertisement

Akhilesh Yadav: బీజేపీకి 150 సీట్లు కూడా రావు.. ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతుంది..

Akhilesh Yadav: బీజేపీకి 150 సీట్లు కూడా రావు.. ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతుంది..
Advertisement

Akhilesh Yadav: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని.. 150 కంటే ఎక్కువ సీట్లు రావని ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు అఖిలేష్ యాదవ్ అధికార పాలనపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ అవినీతికి ఛాంపియన్ అని.. దోపిడీ, అబద్ధాలు కాషాయ పార్టీ గుర్తింపుగా మారాయని అన్నారు. ఘజియాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు.

పశ్చిమాన ఘజియాబాద్ నుంచి తూర్పున ఘాజీపూర్ వరకు బీజేపీని ఇండియా కూటమి తుడిచిపెడుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ తీరుతో దేశంలోని రైతులు విసిగిపోయారని అన్నారు. ఇండియా కూటమి ప్రజల్లో కొత్త ఆశలను కలిగిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులకు కనీస మద్ధతు ధర ప్రకటించారని.. అందుకు తగ్గట్టుగా ఇండియా కూటమి పార్టీలు కనీస మద్ధతు ధర హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో రైతుల ఆదాయం పెరిగితేనే పేదరికం నిర్మూలన జరుగుతుందని అన్నారు.

Akhilesh Yadav
Akhilesh Yadav
Advertisement

అవినీతిపరులందరి అడ్డాగా బీజేపీ మారిందని.. అవినీతిపరులను తమ పార్టీలోకి తీసుకోవడమే కాకుండా అవినీతిపరులు సంపాదించిన సొమ్మును కూడా తమ వద్దే ఉంచుకుంటున్నారని.. దోపిడీ, అబద్ధాలు బీజేపీకి గుర్తింపుగా మారాయన్నారు. ఉద్యోగాల విషయంలో బీజేపీ చేసిన వాగ్దానాలన్నీ అబద్ధాలేనని ఎస్పీ అధినేత ఆరోపించారు.

15 రోజుల క్రితం బీజేపీకి 180 సీట్లు వచ్చే అవకాశం ఉండేది.. కానీ అది ఇప్పుడు 150 పడిపోయిందని రాహుల్ గాంధీ అన్నారు. ఏప్రిల్ 26న జరగనున్న రెండో దశ పోలింగ్‌లో బీఎస్పీ మాజీ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి డానిష్ అలీ మళ్లీ ఎన్నికవ్వాలని కోరుతున్న అమ్రోహాలో రాహుల్, అఖిలేష్ తొలిసారి ఇద్దరు కలిసి ప్రచారంలోకి దిగనున్నారు.

Advertisement

ఎలక్టోరల్ బాండ్లను పారదర్శకత కోసం తీసుకొచ్చామని, అయితే అది ఫ్లాప్ షోగా ముగిసిందని మోదీ సుదీర్ఘమైన స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారని రాహుల్ గాంధీ అన్నారు. మోదీ వివరణలు నిజమైతే, ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసిందనే ప్రశ్న మిగిలిపోతుందని ఆయన అన్నారు.

Also Read: ఎంపీ ఎన్నికలే టార్గెట్.. ‘ఆప్ కా రామరాజ్య’ వైబ్‌సైట్ ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ

“మీరు పారదర్శకత తీసుకురావాలనుకుంటే, మీరు బీజేపీకి డబ్బు ఇచ్చిన వారి పేర్లను ఎందుకు దాచారు, వారు మీకు డబ్బు ఇచ్చిన తేదీలను ఎందుకు దాచారు?.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం. వ్యాపారవేత్తలందరూ దీనిని అర్థం చేసుకున్నారు. ప్రధాని అవినీతికి కారకుడని దేశం మొత్తానికి తెలుసు కాబట్టి ఆయన ఎంత స్పష్టం చేసినా దాని ప్రభావం ఉండదు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

2024 ఎన్నికల యుద్ధాన్ని RSS-BJP, ఇండియా కూటమి సిద్ధాంతాల మధ్య పోరుగా పరిగణిస్తున్నారన్నారు రాహుల్ గాంధీ. ఎన్నికల్లో ప్రధానమంత్రి కానీ, బీజేపీ కానీ సమస్యలపై పెద్దగా మాట్లాడడం లేదని రాహుల్ అన్నారు. ఎన్నికల్లో 2-3 పెద్ద సమస్యలు ఉన్నాయని.. నిరుద్యోగం అతిపెద్దది, ద్రవ్యోల్బణం రెండోది కానీ బీజేపీ పరధ్యానం సృష్టించే పనిలో నిమగ్నమై ఉందని కాంగ్రెస్ అగ్రనేత స్పష్టం చేశారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×