E-Paper
Advertisement

Annamalai-Tamilisai Meeting: అమిత్ షా వార్నింగ్.. ప్రాధాన్యత సంతరించుకున్న అన్నామలై-తమిళిసై భేటీ..

Annamalai-Tamilisai Meeting: అమిత్ షా వార్నింగ్.. ప్రాధాన్యత సంతరించుకున్న అన్నామలై-తమిళిసై భేటీ..
Advertisement

Annamalai-Tamilisai Meeting: తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై శుక్రవారం చెన్నైలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిశారు. ఇటీవలి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో తమిళిసై సౌందరరాజన్ అన్నామలైపై విమర్శలు చేశారు. దీంతో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తినట్లు మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. దీంతో అన్నామలై తమిళిసైను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైను కలిసిన తర్వాత అన్నామలై ట్విట్టర్ వేదికగా స్పందించారు. మాజీ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ఆమె రాజకీయ అనుభవం, వారి సలహాలు పారటీ ఎదుగుదలకు స్పూర్తినిస్తాయని సోషల్ మీడిలో రాసుకొచ్చారు.

Advertisement

లోక్‌సభ ఎన్నికల తర్వాత, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఉంటే తమిళనాడులో పార్టీ మెరుగైన పనితీరు కనబరిచేదని సౌందరరాజన్ పేర్కొన్నారు. బీజేపీ-అన్నాడీఎంకే విడిపోవడానికి అన్నామలై కారణమని ఆరోపించిన ఎఐఎడీఎంకే నాయకుడికి తమిళిసై బహిరంగంగా మద్దతు తెలిపారు. అలాగే తమిళిసై సౌందరరాజన్ కూడా బీజేపీలో నేరపూరిత అంశాలున్నాయని ఎవరి పేరును ప్రస్తావించకుండా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

సెప్టెంబరు 2023లో, అన్నాడీఎంకే బీజేపీతో బంధాన్ని తెంచుకుంది. దీనికి కారణంగా అన్నామలై అన్నాడీఎంకే మాజీ నాయకులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయటమా కారణంగా పలువురు ఎత్తిచూపారు.

Also Read: ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో భేటీ కానున్న యోగి.. ‘గాలి బుడగ’ పై చర్చించే అవకాశం

ఇదిలా ఉంటే ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజున కేంద్ర హోం మంత్రి అమిత్ షా వేదికపై సౌందరరాజన్‌ను తిట్టినట్లు కనిపించిన వీడియే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో అమిత్ షా.. తమిళిసైను హెచ్చరించినట్లు కనిపించింది. వీటన్నిటి నడుమ అన్నామలై-తమిళిసై సౌందరరాజన్ భేటీ తమిళ నాట, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×