E-Paper
Advertisement

Suresh Gopi: నేనన్న దాంట్లో తప్పేమీ లేదు: కేంద్ర మంత్రి సురేష్ గోపి

Suresh Gopi: నేనన్న దాంట్లో తప్పేమీ లేదు: కేంద్ర మంత్రి సురేష్ గోపి
Advertisement

Suresh Gopi: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని మదర్ ఆఫ్ ఇండియా అని సంబోధించిన కేంద్ర మంత్రి సురేష్ గోపి తన వ్యాఖ్యలపై ఆదివారం క్లారిటీ ఇచ్చారు. తిరువనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఇందిరా గాంధీని అమ్మగా అభివర్ణించానని  తెలిపారు. కానీ తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని అన్నారు.

తాను మనస్పూర్తిగా మాట్లాడే వ్యక్తినన్న సురేష్ గోపి.. ఇందిరా గాంధీ గురించి తాను మట్లాడిన దాంట్లో తప్పేమీ లేదన్నారు. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా.. కేరళలో కాంగ్రెస్ పార్టీ పితామహుడు కరుణాకరణ్ అయితే.. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇందిరా గాంధీ తల్లి లాంటి వారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి చనిపోయే వరకు ఇందిరా గాంధీ భారత్‌కు ఆర్కిటెక్ట్ అని తెలిపారు.

Advertisement

విపక్ష పార్టీకి చెందిన నాయకురాలు అయినంత మాత్రాన దేశం కోసం నిజాయితీగా పనిచేసిన వ్యక్తిని తాను ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు. ఇక కరుణాకరణ్‌ను కేరళలో కాంగ్రెస్‌కు పితామహుడు అనడం, ఆ పార్టీ వ్యవస్థాపకులు.. సహ వ్యవస్థాపకులను అగౌరవ పరిచినట్లు కాదని తన వ్యాఖ్యలపై సురేష్ గోపి క్లారిటీ ఇచ్చారు.

Also Read: ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన రాహుల్ గాంధీ!

Advertisement

త్రిస్సూర్‌లోని దివంగత కాంగ్రెస్ సీఎం కరుణాకరణ్ మెమోరియల్‌ను శనివారం కేంద్ర మంత్రి సురేష్ గోపి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మాజీ ప్రధాని ఇందిరా గాంధీని మదర్ ఆఫ్ ఇండియా అని అన్నారు. దీంతో సురేష్ గోపి వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారి తీసాయి. ఈ కారణంగానే సురేష్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×