E-Paper
Advertisement

BJP Election Incharges : 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జులను నియమించిన బీజేపీ

BJP Election Incharges : 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జులను నియమించిన బీజేపీ
Advertisement

BJP Appointed Incharges to Four States : బీజేపీ అధిష్ఠానం నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జులను నియమించింది. నలుగురు కేంద్రమంత్రుల్ని నాలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జులుగా నియమిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.

జమ్ముకశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని, మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, మహారాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్, హర్యానా ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ లను నియమించింది. అలాగే.. ఝార్ఖండ్ కు శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిశ్వా శర్మలను నియమించింది.

Advertisement

ఇటీవలే కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ముచ్చటగా మూడోసారి ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేసి.. బాధ్యతలు స్వీకరించారు. లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. ఇప్పుడు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించింది. జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం ఎన్నికల ఇన్ఛార్జులను నియమించింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×