E-Paper
Advertisement

Bilkis Bano | లొంగిపోయేందుకు మరింత సమయం కావాలి.. సుప్రీంకు బిల్కిస్ బానో దోషులు

Bilkis Bano | గుజరాత్‌ గోధ్రా అల్లర్లకు సంబంధించిన బిల్కిస్ బానో కేసు దోషులు తిరిగి జైలుకు వెళ్లడానికి మరింత సమయం కావాలని గురువారం జనవరి 18న సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసులో మొత్తం 11 మంది దోషులుండగా.. వారిలో ముగ్గురు మాత్రమే కోర్టులో పిటిషన్ వేశారు. మిగతా దోషులు పరారీలో ఉన్నట్లు సమాచారం.

Bilkis Bano | లొంగిపోయేందుకు మరింత సమయం కావాలి.. సుప్రీంకు బిల్కిస్ బానో దోషులు
Advertisement

Bilkis Bano | గుజరాత్‌ గోధ్రా అల్లర్లకు సంబంధించిన బిల్కిస్ బానో కేసు దోషులు తిరిగి జైలుకు వెళ్లడానికి మరింత సమయం కావాలని గురువారం జనవరి 18న సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసులో మొత్తం 11 మంది దోషులుండగా.. వారిలో ముగ్గురు మాత్రమే కోర్టులో పిటిషన్ వేశారు. మిగతా దోషులు పరారీలో ఉన్నట్లు సమాచారం.

లొంగిపోవడానికి ఇంకా సమయం అవసరమని కారణాలు చూపుతూ.. ఒకరు తనకు ఊపితిత్తుల ఆపరేషన్ జరిగిందని చెప్పగా.. మరొకరు తన పండించిన పంట కోత సమయం చెప్పారు. మూడో దోషి తన కొడుకు పెళ్లి ఉందని కారణం చూపారు.

Advertisement

బిల్కిస్ బానోపై రేప్, ఆమె కుటుంబం(పిల్లలు, చెల్లెలు, తల్లి)లోని మొత్తం 11 మందిని హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన ఈ 11 మంది 2022 సంవత్సరంలో జైలు నుంచి శిక్షాకాలం పూర్తి చేయకుండానే విడుదల అయ్యారు. గుజరాత్ ప్రభుత్వం చొరవ తీసుకొని వీరందరినీ విడుదల చేసింది. విడుదలైన రోజు వీరందరికీ పూల మాలలు వేసి ఒక రాజకీయ పార్టీ సభ్యులు సత్కరించారు. దీంతో ఈ కేసు దేశమంతా సంచలనం సృష్టించింది.

అయితే ఇటీవల సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని వ్యాఖ్యానిస్తూ.. బిల్కిస్ బానో దోషుల విడుదలను రద్దు చేసింది. వారందరినీ రెండు వారాల లోపు తిరిగి జైలుకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో 11 మంది దోషలందరూ జనవరి 21 2024 లోపు పోలీసుల వద్ద లొంగిపోవాలి.

Advertisement

అయితే మరో మూడు రోజుల్లో సుప్రీం కోర్టుకు ఇచ్చిన గడువు ముగిసిపోనుండగా.. ఈ దోషులలో ముగ్గురు.. లొంగిపోయేందుకు మరింత సమయం ఇవ్వాలని కోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్‌పై దేశ అత్యున్నత కోర్టు శుక్రవారం జనవరి 19న విచారణ చేపట్టడానికి అంగీకరించింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×