E-Paper
Advertisement

9 devotees electrocuted in Bihar: బీహార్‌లో ఘోరం.. వాహనానికి విద్యుత్ వైర్లు తగిలి 9 మంది మృతి

9 devotees electrocuted in Bihar: బీహార్‌లో ఘోరం.. వాహనానికి విద్యుత్ వైర్లు తగిలి 9 మంది మృతి
Advertisement

9 devotees electrocuted in Bihar(National news today India): బీహార్‌లో ఘోరం జరిగింది. కావడి యాత్రికులు ప్రయాణిస్తున్న మినీ ట్రక్కుకు హైటెన్షన్ విద్యుత్‌ వైరు తగిలాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరో ఆరుగురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. హాజీపూర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియా సుల్తాన్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఇంకో లోతుల్లోకి వెళ్తే.. హాజీపూర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియా నుంచి కొంతమంది యాత్రికులు సోన్‌పూర్‌లో బాబా ఆలయానికి వెళ్తున్నారు. అర్థరాత్రి సమయంలో మినీ ట్రక్కులో యాత్రికులు పమెల్జా నుంచి గంగా జలాన్ని తీసుకెళ్తున్నారు. అందులో డీజేని కూడా తీసుకె ళ్లారు. అయితే డీజే వద్దని.. వైర్లు తగులుతాయని కొందరు చెప్పారు. ఏం పర్వాలేదని మరికొందరు వారించారు.

Advertisement

చివరకు డీజే ఎత్తు పొడవుగా ఉండడంతో హైఓల్టేజీ విద్యుత్ వైర్లకు తగిలాయి. స్పాట్‌లో 8 మంది మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడినవారిలో ఆరుగురు ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘటనలో పోలీసులు నోరు విప్పారు.

ALSO READ:  బీహార్ సీఎం కావాలంటే టెన్త్ పాసవ్వాలట..పీకే చెబుతున్న మాట

Advertisement

కావడి యాత్రికులు ట్రాలీలో డీజేని తీసుకెళ్తున్నారని, ఆ డీజీకి 11 వేల వోల్టల విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదంగా మారింది. మరోవైపు స్థానికులు విద్యుత్ శాఖ అధికారులపై మండిపడుతున్నారు. పదేపదే ఫోన్ చేసినప్పటికీ, అధికారుల నుంచి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, ఫలితంగా తొమ్మిది మంది మృతి చెందారని అంటున్నారు. దీనికి కారణం ముమ్మాటికీ విద్యుత్ శాఖ అధికారులేనని అంటున్నారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×