E-Paper
Advertisement

Bihar Bridge Collapse : ప్రారంభోత్సవానికి ముందే కూలిన వంతెన..

Bihar Bridge Collapse : ప్రారంభోత్సవానికి ముందే కూలిన వంతెన..
Advertisement

Bihar Bridge Collapse : ప్రారంభోత్సవానికి ముందే వంతెన కూలిపోయింది. అట్లుంటది మరి మన ఇంజినీర్లు, కాంట్రాక్టుల పనితనం. కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకంగా నిర్మిస్తే ప్రారంభానికి ముందేం కర్మ కట్టకముందే కూలిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. బిహార్‌లో ఓ బ్రిడ్జి ఇలానే ప్రారంభానికి ముందే కుప్ప కూలిపోయింది. బ్రిడ్జిపై వాహనాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

బిహార్​లోని బెగూసరాయ్​లో గండక్​ నదిపై 2017లో ఈ వంతెనను నిర్మించారు. మా భగవతి సంస్థ ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. దీనికి 13 కోట్లు ఖర్చు చేశారు. కానీ అప్రోచ్ రోడ్డు లేకపోవడం వల్ల.. ఈ వంతెనకు ప్రారంభోత్సవం నిర్వహించలేదు. ఆఫీషియల్‌గా ఇంకా ప్రారంభించకపోయినా బ్రిడ్జిపై వాహన రాకపోకలు మత్రం సాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మించి ఐదేళ్లు కూడా కాకముందే కుప్పకూలిపోయింది.

Advertisement

ఆ సమయంలో వంతెనపై వాహనాలు లేనందున పెద్ద ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు అంటున్నారు. వంతెన నిర్మించిన కాంట్రాక్టర్​ను వెంటనే అరెస్టు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వంతెన నిర్మాణంలో భారీ దోపిడీ జరిగిందని ఆరోపిస్తున్నారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×