E-Paper
Advertisement

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట
Advertisement

Vote for Note Case: ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి చెందిన హైకోర్టుకు బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణను రేవంత్ రెడ్డి ప్రభావితం చేస్తారనే దానిపై ఆరోపణలు తప్ప ఆధారాలు లేవన్న సుప్రీంకోర్టు.. ఈ దశలో జగదీశ్ రెడ్డి పిటిషన్ ను ఎంటర్ టైన్ చేయలేమని తేల్చి చెప్పింది. కేసు విచారణలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. అలాగే ఈ కేసుకు సంబంధించిన వివరాలను రేవంత్ కు రిపోర్ట్ చేయవద్దని సుప్రీం ధర్మాసనం ఏసీబీకి కూడా ఆదేశాలు జారీ చేసింది.

ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణకు కూడా నిరాకరించిన ధర్మాసనం.. మున్ముందు సీఎం రేవంత్ రెడ్డి కేసులో జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది.

Advertisement

ఆగస్టు నెలలోనూ కేసు ట్రయల్ బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేయగా.. న్యాయస్థానం దానిని కొట్టివేసింది. కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు బదిలీ చేయడం కుదరదని, కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే.. న్యాయవ్యవస్థపై నమ్మకం లేనట్టే అవుతుందని వ్యాఖ్యానించింది.

Also Read: ఓటుకు నోటు కేసు, పిటిషన్ డిస్మిస్

Advertisement

2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేలా ఓటర్లకు డబ్బు పంచాలని ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు డబ్బు అప్పగించినట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత చంద్రబాబు – స్టీఫెన్ ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ, చంద్రబాబు- రేవంత్ భేటీలో డబ్బు అప్పజెప్పిన వీడియో ఫుటేజీ బయటికి రావడంతో.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఇందులో రేవంత్ రెడ్డి హస్తం కూడా ఉందని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించడంతో.. కేసు విచారణపై ఉత్కంఠ పెరిగింది. వరుస వాయిదాల తర్వాత రేవంత్ కు ఊరట లభించింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×