E-Paper
Advertisement

Breaking: అయోధ్య రామ మందిరంలో కశ్మీర్ యువకుడు హల్‌చల్, టెంపుల్‌లో నమాజ్ చదువుతుండగా..?

Breaking: అయోధ్య రామ మందిరంలో కశ్మీర్ యువకుడు హల్‌చల్, టెంపుల్‌లో నమాజ్ చదువుతుండగా..?
Advertisement

అయోధ్యలోని ప్రతిష్ఠాత్మక రామ మందిర ప్రాంగణంలో శనివారం ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కశ్మీర్‌కు చెందిన ఒక యువకుడు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి హల్చల్ సృష్టించాడు. నిందితుడిని కశ్మీర్ నివాసి అహ్మద్ షేక్‌గా పోలీసులు గుర్తించారు. పోలీస్ సెక్యూరిటీని దాటుకుని లోపలికి వెళ్లిన ఈ యువకుడు, అక్కడ నమాజ్ చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం.

ఆలయ భద్రతా సిబ్బంది, అక్కడున్న భక్తులు యువకుడి ప్రవర్తనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అయోధ్య పోలీసులు అహ్మద్ షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించాడన్న ఆరోపణలతో అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అతడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

Advertisement

అసలు ఆ యువకుడు అయోధ్యకు ఎందుకు వచ్చాడు..? ఆలయంలో నమాజ్ చేయడానికి గల కారణాలేంటి? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అయోధ్య వంటి భక్త పరవశమైన ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

ALSO READ: BRS : జాబ్ క్యాలెండర్ పంచాయితీ.. బీఆర్ఎస్‌కు మంత్రి మాస్టర్ స్ట్రోక్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×