E-Paper
Advertisement

తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. 24 మంది ఎమ్మెల్యేలపై వేటు..!

తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. 24 మంది ఎమ్మెల్యేలపై వేటు..!
Advertisement

AIADMK Rebels: తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేసినందుకు గానూ మాజీ మంత్రి సి.వి. షణ్ముగం సహా 24 మంది ఎమ్మెల్యేలపై అన్నా డీఎంకే (AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (EPS) కఠిన చర్యలు తీసుకున్నారు. పార్టీ పదవుల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

అంతేకాకుండా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు దరఖాస్తు చేయనున్నట్లు అన్నా డీఎంకే పార్టీ ప్రకటించింది. టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ పార్టీ జారీ చేసిన విప్ ను వారు అతీక్రమించారని పళనిస్వామి వర్గం పేర్కొంది. పార్టీ జారీ చేసిన విప్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తే.. వారికి ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుందని చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్నాడీఎంకే సీనియర్ నేతలు అన్నారు. దీనికి సంబంధించి ఫిర్యాదును సైతం సమర్పించినట్లు తెలిపారు.

Advertisement

తమిళనాడు అసెంబ్లీలో అన్నా డీఎంకేకు ఉన్న 47 మంది ఎమ్మెల్యేల్లో 24 మంది.. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ విశ్వాస తీర్మానంలో విజయ్ కు 144 మంది సభ్యుల మద్దతు లభించడంలో వారు కీలక పాత్ర పోషించారు. అయితే తమ నేతలు.. మంత్రి పదవుల ఆశతోనే విజయ్ పార్టీకి మద్దతు తెలిపారని పళనిస్వామి ఆరోపించారు. దీనిని పార్టీకి చేసిన ద్రోహంగా అభివర్ణించారు.

Also Read: పోక్సో కేసులో కీలక పరిణామం.. పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. సాక్ష్యాలతో వస్తానంటూ..

Advertisement

అన్నా డీఎంకే చీలిక వర్గానికి నేతృత్వం వహించిన సి.వి. షణ్ముగం.. పళనిస్వామి ఆరోపణలను తప్పుబట్టారు. పళనిస్వామి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయన డీఎంకేతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. పార్టీని కాపాడుకోవడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, మెజారిటీ ఎమ్మెల్యేలు తమవైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మెుత్తంగా అన్నా డీఎంకే చీలిక వ్యవహారం ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Sofa Politics: ‘పుష్ప’ స్టైల్లో హార్స్ ట్రేడింగులు.. విజయ్‌పై ప్రతిపక్షాలు ఫైర్, అల్లాడిపోతున్న దళపతి

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×