E-Paper
Advertisement

Drug trafficking: పోలీసుల నుంచి తప్పించుకున్న పంజాబ్‌ డ్రగ్స్‌ రవాణా కేసు నిందితుడు

Drug trafficking: పోలీసుల నుంచి తప్పించుకున్న పంజాబ్‌ డ్రగ్స్‌ రవాణా కేసు నిందితుడు
Advertisement

drug trafficking Accused escaped from police: పంజాబ్‌ డ్రగ్స్‌ రవాణా కేసులోని నిందితుల్లో ఒకరైన జోబంజిత్‌ సింగ్‌ సంధు పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్నాడు. నిందితున్ని కచ్‌లోని భుజ్‌ జైలులో ఉంచారు. అక్కడి నుంచి కేసుకు సంబంధించి కోర్టులో హాజరుపరిచేందుకు అమృత్‌సర్‌కు తరలిచారు. తిరిగి కచ్‌కు వస్తుండగా మార్గం మధ్యలో పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడు.

దీంతో పోలీసులు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుని కోసం స్థానిక పోలీసుల సహాయంతో సెర్చ్‌ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. అతనిని పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారి వెల్లడించారు.

Advertisement

Read More: సీట్ల లెక్కలు తేల్చండి.. కాంగ్రెస్ కు అఖిలేష్ అల్టిమేటం..

2021లో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో 2,988 కిలోల హెరాయిన్‌ పట్టుబడింది. ఈ డ్రగ్స్ విలువ 21000 కోట్లు డాలర్లు ఉంటుందని అంచన. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో రిజిస్టరైన ఓ ట్రేడింగ్ కంపెనీ డ్రగ్‌ను దిగుమతి చేసుకుంటుండగా అధికారులు అడ్డుకున్నారు. సెమీ ప్రాసెస్డ్ టాల్క్ రాళ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది.

Advertisement

ఆఫ్ఘనిస్థాన్‌లో డ్రగ్స్‌ను ఉత్పత్తి చేసి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్ట్ ద్వారా ముంద్రా పోర్టుకు తీసుకువచ్చినట్లు విచారణలో తేలింది. అహ్మదాబాద్‌, ఢిల్లీ, చెన్నై, గాంధీధామ్‌, గుజరాత్‌లోని మాండ్వీలలోని పలు చోట్ల ఈ ఏజెన్సీలు దాడులు నిర్వహించాయి. ట్రేడింగ్ కంపెనీ యజమానులు ఎం సుధాకర్, ఆయన భార్య జి దుర్గా పూర్ణ వైశాలి సహా పలువురిని అరెస్టు చేశారు. ఏడు సంస్థలు, 42 మందిపై కేసు నమోదు చేశారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×