E-Paper
Advertisement

Smuggler : సీఎంతో కలిసి భోజనం చేసిన స్మగ్లర్‌.. ఫోటో వైరల్..

Smuggler : సీఎంతో కలిసి భోజనం చేసిన స్మగ్లర్‌.. ఫోటో వైరల్..
Advertisement

Smuggler : ఆ స్మగ్లర్ కలప చోరీ కేసులో అరెస్ట్ అయ్యాడు. రెండు రోజులపాటు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ పై బయటకొచ్చాడు. ఇలా బయటకు వచ్చి కొన్నిరోజులకే సీఎంతో కలిసి భోజనం చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల సిధీ జిల్లాలో పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కలప స్మగ్లింగ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన అరవింద్ గుప్తా అనే వ్యక్తి ఈ కార్యక్రమానికి వచ్చాడు. ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని భోజనం కూడా చేశాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ తో మాటలు కలిపాడు. ముచ్చటిస్తూ విందు భోజనం ఆరగించాడు.

Advertisement

అసలు విషయం తెలియని సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మాటల మధ్యలో ఆ దొంగ వీపు కూడా తట్టారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. సీఎంతో కలిసి స్మగ్లర్ భోజనం చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి అరవింద్‌ గుప్తా అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఓ స్మగ్లర్‌ ఇలా ముఖ్యమంత్రి పక్కనే కూర్చోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×