E-Paper
Advertisement

Odisha: ఒడిశాలో దారుణం.. యువకుడు ప్రేమ పెళ్లి, 40 మందికి శిరోముండనం

Odisha: ఒడిశాలో దారుణం.. యువకుడు ప్రేమ పెళ్లి, 40 మందికి శిరోముండనం
Advertisement

Odisha: తమ గ్రామానికి చెందిన యువకుడు మరొక కులానికి చెందిన యువతిని వివాహం చేసుకోవడం ఆ గ్రామ పెద్దలకు నచ్చలేదు. గ్రామ కట్టుబాట్లను ఉల్లంఘించారంటూ యువతి కుటుంబసభ్యులపై రుసరుసలాడారు. వారిని ఊరి నుంచి వెలి వేయకుండా ఊహించని విధంగా శిక్ష విధించారు. ఈ ఘటన ఒడిషాలో వెలుగు చూసింది.

ఒడిశాలోని రాయగడ జిల్లా కాశీపూర్‌ సమితి అమానుష ఘటనకు వేదికైంది. యువతి కుటుంబసభ్యులను ఊరి వెలి శిక్ష నుంచి తప్పించుకునేందుకు కుటుంబంలోని దాదాపు 40 మంది పురుషులు శిరోముండనం చేశారు ఆ గ్రామ పెద్దలు. స్థానిక గోరఖ్‌పూర్‌ పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి, షెడ్యూల్డ్‌ కులానికి చెందిన యువకుడు ప్రేమించింది.

Advertisement

చివరకు వీరిద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే యువతి తరపు వారు ఈ పెళ్లి ససేమిరా అన్నారు. ఈ క్రమంలో ప్రేమికులు మూడు రోజుల కిందట వివాహం చేసుకున్నారు. ఆ జంట రెండురోజుల కిందట గ్రామానికి వచ్చింది. ప్రేమ జంట తమ ఊరికి వచ్చిన విషయం గ్రామ పెద్దలకు తెలిసింది.

ఆ గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువతి కుటుంబ సభ్యులను వెలివేశారు. ఈ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయం ఆలోచించారు. వెలికి బదులుగా శిరోముండనం చేయించుకోవాలని నిర్ణయించారు.  అందుకు యువతి కుటుంబసభ్యులు ఓకే చెప్పారు. ఎందుకంటే యువతికి పెళ్లికి వారి కుటుంబసభ్యులు అంగీకరించలేదు. అలాగే మూగ జీవాలను బలిచ్చి నూతన జంటకు పెద్ద కర్మ చేయాలని డిసైడ్ అయ్యారు.

Advertisement

ALSO READ: 1206.. చివరకు చావు కూడా లక్కీ నెంబర్‌తోనే

చేసేదేమీ లేక యువతి కుటుంబసభ్యులు, బంధువులు దాదాపు 40 మంది పురుషులు శిరోముండనం చేయించుకున్నారు.  గ్రామ కట్టుబాట్లు ప్రకారం మేక, గొర్రె, కోడి, పావురాలను బలి ఇచ్చి పూజలు చేశారు. ఈ వ్యవహారం మీడియా దృష్టికి వచ్చింది. దీనిపై పోలీసులను మీడియా ప్రతినిధులు అడిగారు. తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.

అసలే అమ్మాయిలు దొరక్క రోజు రోజుకూ పెళ్లికాని ప్రసాదుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి సమయంలో గ్రామ పెద్దలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో చాలామంది మండిపడుతున్నారు. జీవితాంతం కలిసి ఉండేది వాళ్లేనని, మీ జోక్యం ఏంటని ప్రశ్నించినవాళ్లు లేకపోలేదు. గ్రామ పెద్దల తీర్మానానికి ఏ ఒక్కరూ నోరు విప్పలేదు. తీర్మానం మేరకు శిరోముండనం చేయించుకున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×