E-Paper
Advertisement

Sabarimalai temple: శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యా యత్నం, ఎందుకిలా?

Sabarimalai temple: శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యా యత్నం, ఎందుకిలా?
Advertisement

Sabarimalai temple: కార్తీక మాసం మొదలు శబరిమల కొండలు స్వామియే శరణం అయ్యప్ప నినాదంతో మార్మోగుతాయి. స్వామి దర్శించుకునేందుకు దేశంలోని నలుమూలల నుంచి భక్తులు అక్కడికి వస్తుంటారు. సోమవారం అనుకోని ఘటనతో అయ్యప్పభక్తులు ఉలిక్కపడ్డారు. అసలేం జరిగింది.

ఇక అసలు విషయానికొద్దాం. స్వాములు దీక్ష విరమించే సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వాములు శబరిమలకు చేరుకున్నారు. ఏం జరిగిందో తెలీదుగానీ అయ్యప్ప ఆలయంలో ఓ భక్తుడు సన్నిధానం పైనున్న ప్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో అక్కడి స్వాములు షాకయ్యారు.

Advertisement

అక్కడున్న వెంటనే స్పందించారు. అలాగే సెక్యూరిటీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భక్తుడు కర్ణాటకకు చెందిన కుమారస్వామిగా గుర్తించారు.

ఆయన వయస్సు దాదాపు 40 ఏళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. సోమవారం సాయంత్రం సన్నిధానం నుంచి మళికప్పురం వెళ్లే ప్లైఓవర్ నుంచి దూకినట్టు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఆ స్వామి మానసిక క్షోభకు గురవుతున్నట్లు ఆయన టీమ్‌లోని కొందరు చెబుతున్నమాట. స్వామి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఆ స్వామి ఆరోగ్యం గురించి తెలియాల్సివుంది.

Advertisement

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×