E-Paper
Advertisement

infosys layoff : 700 మంది ఉద్యోగుల తొలగింపు – బౌన్సర్లతో బయటకు నెట్టించిన ఇన్ఫోసిస్

infosys layoff : 700 మంది ఉద్యోగుల తొలగింపు – బౌన్సర్లతో బయటకు నెట్టించిన ఇన్ఫోసిస్
Advertisement

Infosys layoff : భారత్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా 700 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరంతా ఇటీవలే ఉద్యోగాలు పొందిన ప్రెషర్స్ అని ఐటీ ఎంప్లాయిస్ యూనియన్ వెల్లడించింది. వీరంతా మైసూర్ క్యాంపస్ కి చెందిన వారని తెలిపిన యూనియన్.. టెర్మినేట్ చేసిన ఉద్యోగులతో ఇన్ఫోసిస్ చాలా దురుసుగా వ్యవహరించిందని తెలిపింది. వారిని క్యాంపస్ నుంచి బయటకు
పంపేందుకు బౌన్సర్లు, సెక్యూరిటీ గార్డుల్ని వినియోగించినట్లు ఆరోపించింది. వారితో టెర్మినేటుకు సంబంధించిన విషయాలు పంచుకోకుడదనే అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుందని అన్నారు.

ప్రస్తుతం ఉద్యోగాల నుంచి తొలగించిన వాళ్లంతా ఇటీవలే ఉద్యోగాలు సాధించిన ఫ్రెషర్లు అని తెలిపిన ఐటీ ఉద్యోగుల యూనియన్.. వీరిని రెండు, మూడు నెలలు మాత్రమే ఆన్ బోర్డుపై ఉంచి.. ఇప్పుడు ఒకేసారి తొలగించారని వెల్లడించారు. మైసూర్ క్యాంపస్ నుంచి తొలగించిన ఉద్యోగుల పట్ల సంస్థ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు.. కనీస గౌరవం ఇవ్వకుండా అలా వ్యవహరించడం సరైంది కాదని అంటున్నారు.
పైగా.. టెర్మినేట్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో క్యాంపస్ లోకి ఉద్యోగులను ఎవరినీ మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లనివ్వలేదని చెప్పారు. దాంతో.. అక్కడ జరిగిన విషయాన్ని రికార్డు చేసేందుకు, బయట నుంచి సాయాన్ని కోరేందుకు వీలు లేకుండా పోయిందని తెలిపారు.

Advertisement

అయితే ఈ ఘటనపై స్పందించిన ఇన్ఫోసిస్ యాజమాన్యం.. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే అని స్పష్టం చేసింది. ప్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకునే ముందే వారికి అనేక రకాల ఇంటర్నల్ పరీక్షలు ఉంటాయని తెలుపుతామని, వాటిలో అర్హతలు సాధించలేకపోతే.. ఉద్యోగాన్ని వదులుకోవాల్సి ఉంటుందని చెప్పే విధుల్లోకి తీసుకుంటామని వెల్లడిస్తోంది. రిక్యూట్మెంట్ ప్రక్రియలో ఇంటర్నల్ అసెస్మెంట్ ఓ భాగమని తెలిపిన సంస్థ.. ఫ్రెషర్లను రిక్యూట్ చేసుకున్న తర్వాత నిర్వహించిన అనేక సామర్థ్య పరీక్షల్లో వాళ్లంతా ఫెయిలయ్యారని తెలిపింది. అందుకే.. వారిని నిబంధనల ప్రకారం సంస్థ నుంచి తొలగించినట్లు తెలిపింది.

Also Read : అవును.. ఆ ఎన్నికల్లో అవకతవకలు, 39 లక్షల కొత్త ఓటర్లు ఎలా చేరారు?

Advertisement

సంస్థ అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి శాశ్వత ప్రాతిపదికపై ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు ఇన్పోసిస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే.. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐటీ ఉద్యోగుల యూనియన్.. కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపింది. కేంద్ర కార్మిక శాఖకు ఇన్ఫోసిస్ వ్యవహారాన్ని తీసుకెళ్లనున్నట్లు తెలిపిన యూనియన్.. వెంటనే ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టాలని, ఉద్యోగుల భద్రతకు సాయంగా నిలవాలని కోరుతోంది. ఉద్యోగుల హక్కులకు, గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించే సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×