E-Paper
Advertisement

Ambala Road Accident: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 25 మందికి పైగా గాయాలు!

Ambala Road Accident: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 25 మందికి పైగా గాయాలు!
Advertisement
7 Died and 25 Injured in Ambala Road Accident: హర్యానాలోని అంబాలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 7 మంది మృతి చెందగా, 25 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను అంబాలా ఆస్పత్రికి తరలించారు.

 

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. అంబాలా-ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై వైష్ణో దేవికి యాత్రికులతో వెళ్తున్న మినీ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున హర్యానాలోని అంబాలాలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ నుంచి వైష్ణో దేవి దర్శనం కోసం వీరందరూ మినీబస్సులో వెళ్తున్నారు.

Advertisement

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ బస్సులు బోల్తా.. పలువురు మృతి

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కొంతమందిని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రమాదంలో తృటిలో తప్పించుకున్న కొందరు వ్యక్తులు తాము ప్రయాణిస్తున్న బస్సు కంటే ముందు ట్రక్కు ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టిందని పోలీసులకు వివరించారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×