E-Paper
Advertisement

Dehradun : తల్లిదండ్రుల ఆత్మహత్య.. 3రోజులపాటు మృతదేహాల పక్కనే సజీవంగా పసివాడు..

Dehradun : తల్లిదండ్రుల ఆత్మహత్య.. 3రోజులపాటు మృతదేహాల పక్కనే సజీవంగా పసివాడు..
Advertisement

Dehradun : డెహ్రాడూన్ లో విషాదకరమైన ఘటన జరిగింది. ఆ పసివాడు పుట్టిన వారం రోజులు కూడా గడవక ముందే తల్లిదండ్రులు మృతిచెందారు. వారి మృతదేహాల పక్కనే ఆ చిన్నారి ఉన్నాడు. 3 రోజులు వరకు ఆ విషయం బయట ప్రపంచానికి తెలియలేదు. ఆ ఇంటి నుంచి దర్వాసన వస్తోందని ఈ నెల 13న ఇరుపొరుగు వారు చేసిన ఫిర్యాదుతో పోలీసులు వచ్చి తలుపులు తెరిచేసరికి 25 ఏళ్ల ఓ వ్యక్తి, 22 ఏళ్ల అతని భార్య ఫ్లోర్ పైనే విగత జీవులుగా పడిఉన్నారు. వారి మృతదేహాల నుంచి దుర్వాసన వస్తోంది. ఆ చిన్నారి మాత్రం ప్రాణాలతోనే ఉన్నాడు.

Advertisement

అప్పటికి 3 రోజుల క్రితం భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. ఆ చిన్నారిని ప్రభుత్వం డూన్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. పసివాడు డీహైడ్రేషన్ కు గురైయ్యాడని వైద్యులు తెలిపారు. కానీ ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు .

ఆ చిన్నారి డీహైడ్రేషన్ స్థితిలో ఉండగా తీసుకొచ్చారని GDMCH చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యూసఫ్ రిజ్వీ తెలిపారు. వెంటనే బాబుకు ఫ్లూయిడ్స్ ఇచ్చామన్నారు. ఆ చిన్నారి ఆరోగ్య పరస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ICUలో ఉంచి పర్యవేక్షిస్తున్నామని ప్రకటించారు. ఆ పసివాడికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. భౌతికంగా ఎలాంటి సమస్యలేవని స్పష్టం చేశారు.

Advertisement

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని ఉత్తర్ ప్రదేశ్ లోని సహరన్ పూర్ చెందిన కషిఫ్ గా గుర్తించారు. అతని భార్య ఆనం జూన్ 8న బాబుకు జన్మనిచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ భార్యాభర్తలు టర్నర్ రోడ్డులోని ఇంటికి 4 నెలల క్రితమే అద్దెకు దిగారని వివరించారు. కషిఫ్ క్రేన్ ఆపరేటర్ గా పనిచేసేవాడని.. ఆనంతో ఏడాది క్రితమే వివాహమైందన్నారు. అతనికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×