E-Paper
Advertisement

Amrit Bharat Express: మరో 50 అమృత్ భారత్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్.. రైల్వే మంత్రి ట్వీట్..

Amrit Bharat Express: మరో 50 అమృత్ భారత్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్.. రైల్వే మంత్రి ట్వీట్..
Advertisement
Amrit Bharat Express

Amrit Bharat Express: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రజల నుంచి స్పందన చూసాక కేంద్రం మరికొన్ని అమృత్ భారత్ రైళ్లను ప్రవేశ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా 50 రైళ్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

అమృత్ భారత్ రైళ్లు భారీ విజయం సాధించాయని మంత్రి పేర్కొన్నారు. దీంతో మరో 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్టు తెలిపారు. ఇప్పటివరకు రెండు అమృత్ భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. ఒక రైలు వెస్ట్ బెంగాల్‌లోని మాల్టా నుంచి కర్ణాటకలోని బెంగళూరు మధ్య నడుస్తోంది. ఈ రైలు ఆంధ్ర ప్రదేశ్ గుండా ప్రయాణిస్తోంది. ఇంకొక అమృత్ భారత్ రైలు బిహార్‌లోని దర్భాంగా నుంచి ఢిల్లీ ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నడుస్తోంది. ఈ రెండు రైళ్లకు విశేష స్పందన లభించడంతో కేంద్ర ప్రభుత్వం మరో 50 రైళ్లను ప్రవేశపెట్టనుంది.

Advertisement

Read More: పశ్చిమ బెంగాల్ అధికారులపై బీజేపీ ఎంపీ ఫిర్యాదు.. లోక్‌సభ ప్రివిలేజెస్ కమిటీ ప్రొసీడింగ్స్‌పై సుప్రీంకోర్టు స్టే..

అమృత్ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌లో మొత్తం 22 బోగీలు ఉంటాయి. ఇవి పూర్తిగా ఎల్‌ఎహ్‌బీ బోగీలు. ఇందులో 12 స్లీపర్ కోచ్‌లు, 8 జనరల్ కోచ్‌లతో పాటు 2 లగేజీ కోచ్‌లు ఉంటాయి. పూర్తిగా అధునాతన సాంకేతికతతో తక్కువ సమయంలోనే ఎక్కువ స్పీడ్‌ను అందుకునేలా వీటిని డిజైన్ చేశారు. ఈ రైళ్లు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 1800 మంది ప్రయాణించేలా అమృత్ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను డిజైన్ చేశారు. ఈ రైళ్లు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలను కలుపుతాయి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×