E-Paper
Advertisement

Ex-MPs get Eviction Notices: 200 మందికి పైగా మాజీ ఎంపీలకు నోటీసులు.. ఎందుకంటే?

Ex-MPs get Eviction Notices: 200 మందికి పైగా మాజీ ఎంపీలకు నోటీసులు.. ఎందుకంటే?
Advertisement

Former Lok Sabha MPs get Eviction Notices: దేశ రాజధానిలో ప్రస్తుతం ఓ అంశంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. 200 మందికిపైగా ఎంపీలకు నోటీసులు వెళ్లాయంటా. ఇందుకు సంబంధించి పలు జాతీయ వార్తా కథనాల్లో వెల్లడవుతుంది. ఇంతమందికి ఒకేసారి నోటీసులు వెళ్లడం ఇదే మొదటిసారి అంటూ అందులో పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే..

ఎంపీలుగా ఎన్నికైన వారికి దేశ రాజధాని ఢిల్లీలో బంగ్లాలను కేటాయిస్తారు. గత పార్లమెంటు సభ్యులకు కూడా బంగ్లాలు కేటాయించారు. అయితే, ఇటీవలే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పలువురు ఓటమి చెందారు. ఆ ఓటమి చెందిన ఎంపీలు గతంలో వారికి కేటాయించిన బంగ్లాలను ఇంకా ఖాళీ చేయలేదంటా. ఈ క్రమంలో 200 మందికి పైగా మాజీ పార్లమెంటు సభ్యులకు పార్లమెంటు హౌస్ కమిటీ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వెంటనే ఖాళీ చేయాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: దోడా ఉగ్ర ఘటనపై రాహుల్ సీరియస్.. మీరే కారణమంటూ..

కాగా, ఇటీవలే ఎన్నికైన ఎంపీలకు, పలువురు మంత్రులకు ఇప్పటివరకు కూడా బంగ్లాలను కేటాయించలేదంటూ కూడా ఆ వార్తల్లో పేర్కొంటున్నారు. వారు ఖాళీ చేయకపోవడంతోనే బంగ్లాలు లేక వారికి కేటాయించలేదని, ఈ నేపథ్యంలోనే వారిని వెంటనే ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేశారంటూ ఆ వార్తా కథనాలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ మీరు ఖాళీ చేయకపోతే సిబ్బంది వచ్చి బలవంతంగా ఖాళీ చేయాల్సి వస్తుంది అంటూ అందులో చెప్పారంటా.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×