E-Paper
Advertisement

Encounter: ఛత్తీస్‌గడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

Encounter: ఛత్తీస్‌గడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి
Advertisement

 

Encounter: ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య మరోసారి కాల్పుల యుద్ధం చోటుచేసుకుంది. కాంకేర్, నారాయణ్‌పుర్ జిల్లాల సరిహద్దుల్లో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ భారీ ఎన్ కౌంటర్ లో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది నక్సలైట్లను హతం చేశారు. మహారాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులు ఉన్నట్లు అందిన సమాచారంతో భద్రతా సిబ్బంది ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది.

Advertisement

స్పెషల్ టాస్క ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్ డీఆర్‌జీ దళాలు చేపట్టిన ఆపరేషన్ లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మరణించారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బందికి ఎటువంటి గాయాలపాలు కాలేదని తెలిపారు. అయితే ఘటన స్థలంలో ఏకే 47 తుపాకీ, మరిన్ని ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 10 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది భద్రతా సిబ్బంది, మావోల మధ్య జరిగిన కాల్పుల్లో పెద్ద ఎత్తున మావోలు మరణించారు.

ఏప్రిల్ 16వ తేదీన జరిగిన ఎన్ కౌంటర్ లో 29 మంది మావోయిస్టులు మరణించగా.. మొత్తం ఈ ఏడాది బస్తర్ అడవుల్లో 90 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు.

Advertisement

 

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×