E-Paper
Advertisement

MM Keeravani: గొప్ప అవకాశం అందుకున్న ఆస్కార్ గ్రహీత కీరవాణి.. 2500 మంది కళాకారులతో!

MM Keeravani: గొప్ప అవకాశం అందుకున్న ఆస్కార్ గ్రహీత కీరవాణి.. 2500 మంది కళాకారులతో!
Advertisement

MM Keeravani:ఆస్కార్ గ్రహీత ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి (MM Keeravani). ఇప్పుడు ఒక గొప్ప అవకాశాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా ప్రకటిస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేశారు. అంతేకాదు ఈ అద్భుతాన్ని తిలకించడానికి జనవరి 26 వరకు ఎదురుచూడాల్సిందే అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అసలు విషయంలోకి వెళ్తే.. భారత జాతీయ గీతం అయిన వందేమాతరం ఈ ఏడాదితో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో 150 సంవత్సరాల వందేమాతరంపై ప్రత్యేక దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఎంఎం కీరవాణి తన బృందంతో కలిసి పరేడ్ కి ప్రత్యేకమైన మ్యూజిక్ ను అందించబోతున్నారు.

గొప్ప అవకాశాన్ని అందుకున్న ఎంఎం కీరవాణి..

ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ వేదికగా.. “ప్రియమైన వారందరికీ.. వందేమాతరం.. ఐకానిక్ పాట వందేమాతరం 150వ వార్షికోత్సవ సందర్భంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ కి సంగీతం సమకూర్చడం నేను మరింత గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గొప్ప ప్రదర్శనలో భారతదేశం మొత్తం ప్రసిద్ధి చెందిన 2500 మంది కళాకారులు పాల్గొనబోతున్నారు. మన దేశం యొక్క స్ఫూర్తిని జరుపుకోవడానికి మనం కచ్చితంగా వేచి ఉండాల్సిన సమయం వచ్చేసింది” అంటూ తెలిపారు ఎం ఎం కీరవాణి.

ప్రత్యేక బృందంలో సభ్యులు వీరే..

Advertisement

మొత్తానికైతే 150వ వార్షికోత్సవ సందర్భంగా జరిగే పరేడ్ కి ప్రత్యేక సంగీతాన్ని అందించడానికి సిద్ధం అయ్యారు ఎం.ఎం. కీరవాణి. ఇకపోతే ఈ బృందంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి, గీతా రచయిత సుభాష్ సెహగల్ , వ్యాఖ్యాత అనుపమ్ ఖేర్ కొరియోగ్రాఫర్ సంతోష్ నాయర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాన్ ఇండియా బ్యాండ్ ప్రదర్శనలు, ఐసిసిఆర్ ప్రత్యేక ప్రదర్శనలతో పాటు వందేమాతరం జాతీయ పాట యొక్క చారిత్రక ప్రాముఖ్యత పై దృష్టి సారించనున్నారు.

ALSO READ:Tollywood: సైకిల్ రైడ్ చేస్తున్న ఈ క్యూట్ కిడ్స్ ఎవరో గుర్తుపట్టారా?

150 వసంతాలు పూర్తి చేసుకున్న వందేమాతరం..

Advertisement

వందేమాతరం జాతీయగీతం విషయానికి వస్తే.. 1887లో బంకిం చంద్ర ఛటర్జీ సంస్కృతంలో స్వరపరిచిన ఈ జాతీయ గీతం ఈ ఏడాదితో 150 వసంతాలు పూర్తి చేసుకుంది. బ్రిటిష్ అహింస నుండి భారతదేశం స్వాతంత్ర ఉద్యమం చేపట్టినప్పుడు ఆ ఉద్యమంలో రణ నినాదంగా ఉపయోగపడింది అందుకే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పాటను జాతీయగీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×