E-Paper
Advertisement

గాయపడ్డ మెగా హీరో.. నేడే సర్జరీ!

గాయపడ్డ మెగా హీరో.. నేడే సర్జరీ!
Advertisement

Varun tej:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మెగా కుటుంబం నుండి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun tej). నాగబాబు (Nagababu) వారసుడిగా 2000 సంవత్సరంలో హాండ్సప్ అనే చిత్రంతో బాల నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. 2014లో వచ్చిన ముకుంద సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.6.4 అడుగుల ఎత్తుతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు వరుణ్ తేజ్. మొదటి నుంచే భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన చివరిగా ఆపరేషన్ వాలెంటైన్ , మట్కా వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ‘బరి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

గాయపడ్డ మెగా హీరో వరుణ్ తేజ్..

స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్ గా కనిపించనున్నారు. ఇకపోతే పర్ఫెక్ట్ క్రీడాకారుడిగా కనిపించడానికి గత ఏడు నెలలుగా కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వాలీబాల్ ఆడుతుండగా.. అనుకోకుండా వరుణ్ తేజ్ కాలికి తీవ్రమైన గాయమైంది. ఇక వెంటనే స్పందించిన చిత్ర బృందం వరుణ్ తేజ్ ను ఆసుపత్రికి తరలించారు. సినిమా పట్ల చూపిస్తున్న నిబద్ధత చూసి అందరూ మెచ్చుకుంటున్నా.. ఈ ప్రమాదం జరగడం అభిమానులను పూర్తిగా కలవరపాటుకు గురిచేసింది.

అపోలో హాస్పిటల్లో నేడే సర్జరీ..

Advertisement

ఇకపోతే గాయం తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వైద్యులు శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. దీంతో హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో వరుణ్ తేజ్ కు నేడు సర్జరీ జరగనున్నట్లు చిత్ర బృందం తెలిపింది..ఆపరేషన్ పూర్తయిన తర్వాత మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఇకపోతే తమ అభిమాన హీరోకి నేడు సర్జరీ జరగబోతుందని తెలిసి అభిమానులు సర్జరీ సవ్యంగా సాగాలి అని, త్వరగా ఆయన కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

also read:శివాని, శివాత్మిక అందుకే పెళ్లికి అంగీకరించడం లేదా.. రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో బరి..

Advertisement

ఇక వరుణ్ తేజ్ నటిస్తున్న బరి సినిమా విషయానికి వస్తే.. నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో రూపు దిద్దుకున్న కమిటీ కుర్రోళ్ళు చిత్రానికి దర్శకత్వం వహించిన యదువంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిహారిక స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తూ ఉండడం గమనార్హం. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో అంచనాలు కూడా భారీగా నెలకొన్నాయి. గత నెల అనగా మార్చి 28వ తేదీన గ్రాండ్గా మొదలైన ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని డైరెక్టర్ యదు వంశీ ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ గాయపడడంతో షెడ్యూల్స్ మారుతాయేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. కచ్చితంగా సంక్రాంతి బరిలోనే ఈ సినిమాను తీసుకురావాలని చిత్ర బృందం గట్టి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.. ఏది ఏమైనా సరైన సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×