E-Paper
Advertisement

జననాయగన్ ఎఫెక్ట్..మరో సినిమాకు విజయ్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే?

జననాయగన్ ఎఫెక్ట్..మరో సినిమాకు విజయ్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే?
Advertisement

Vijay Thalapathy: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా విడుదలకు నోచుకోలేకపోయింది. ఈ సినిమా చుట్టూ రాజకీయ కుట్రలు ఉన్నాయని అందుకే సినిమా విడుదల ఆగిపోయింది అంటూ హీరో విజయ్ పలు సందర్భాలలో ఈ సినిమా వాయిదా పడటం వెనుక గల కారణాలను తెలియజేశారు. ఇప్పటికీ ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ రాని నేపథ్యంలో విడుదల కాలేదని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదల ఆలస్యం కావడంతో చిత్ర నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

కెవిన్ బ్యానర్ లో విజయ్ మరో సినిమా..

కేవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై జననాయగన్ (Jananayagan) సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా కారణంగా నిర్మాణ సంస్థకు నష్టాలు రావడంతో ఈయన మరోసారి కేవిఎన్ బ్యానర్ లో సినిమా చేయటానికి సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ లేదా అట్లీ, లోకేష్ కనగరాజ్ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరితో సినిమా ఉంటుందని కోలీవుడ్ సమాచారం. జననాయగన్ విజయ్ ఆఖరి సినిమా అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే .ఈయన టీవీ కె పేరుతో పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఈయన రాజకీయ ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.

రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విజయ్..

Advertisement

ఇలా రాజకీయాలపై పూర్తిస్థాయిలో విజయ్ దృష్టి సారించబోతున్న నేపథ్యంలో ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పేసారు కానీ జననాయగన్ సినిమా వల్ల నిర్మాతలకు నష్టాలు వస్తున్న నేపథ్యంలోనే ఇంకో సినిమా చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ సినిమా అంటే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి విజయ్ సినిమా గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇదే వార్తలు కనుక నిజమైతే విజయ్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్ చూడవచ్చని అభిమానులు కూడా భావిస్తున్నారు.

పైరసీకి గురి అయిన జననాయగన్..

Advertisement

విజయ్ ప్రస్తుతం జననాయగన్ సినిమాని పూర్తిగా పక్కన పెట్టి పెద్ద ఎత్తున రాజకీయ ప్రచార కార్యక్రమాలలో బిజీ అయ్యారు.. ఏప్రిల్ చివరిన తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈయన రాజకీయ కార్యకలాపాలలో బిజీగా గడుపుతున్నారు. జననాయగన్ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన నేపథ్యంలో ఈ సినిమాని తమిళనాడులో ఎన్నికలు పూర్తి అయిన తర్వాతనే విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఇటీవల పైరసీకి గురి కావడంతో ఇలా పైరసీకి పాల్పడిన వారిపై చిత్ర నిర్మాతలు చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇలా సినిమా విడుదల కాకుండానే ఐదు నిమిషాల వీడియో క్లిప్ బయటకు రావడంతో చిత్ర నిర్మాతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: క్లిన్ కారా విషయంలో రైమ్ అంత శ్రద్ధ చూపిస్తుందా… బాడీ గార్డ్ అంటున్న చరణ్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×