E-Paper
Advertisement

చిరంజీవి వద్దకు చేరిన ఎగ్జిబిటర్ల పంచాయితీ.. రేపు సాయంత్రం కీలక భేటీ!

చిరంజీవి వద్దకు చేరిన ఎగ్జిబిటర్ల పంచాయితీ.. రేపు సాయంత్రం కీలక భేటీ!
Advertisement

Tollywood Exhibitors: టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన ఎగ్జిబిటర్ల సమస్యలు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. చిత్ర పరిశ్రమలో అందరికీ పెద్ద దిక్కుగా ఉంటూ, ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి నడిపించే చిరంజీవి వద్దకు ఇప్పుడు ఎగ్జిబిటర్ల పంచాయితీ చేరింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ, సినిమాల విడుదల విధానంపై చర్చించేందుకు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మెగాస్టార్‌తో భేటీ కానున్నారు.

Read also-Illu Illalu Pillalu Today Episodes: నర్మద దెబ్బకు సాగర్ షాక్.. రామరాజు కు కొడుకు కౌంటర్.. చందుకు నిజం చెప్పిన వల్లి..

రేపు సాయంత్రం కీలక సమావేశం

Advertisement

తాజా సమాచారం ప్రకారం.. రేపు సాయంత్రం 4 గంటలకు చిరంజీవితో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ రోజు కానీ, రేపు కానీ దీనికి సంబంధించిన అధికారిక సమయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య సమన్వయం కుదర్చడంలో చిరంజీవి పాత్ర కీలకం కానుంది.

పర్సంటేజ్ vs రెంటల్ విధానం

ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు ప్రధానంగా రెండు అంశాలను చిరంజీవి ముందు ఉంచబోతున్నారు. రాబోయే రోజుల్లో విడుదల కానున్న పెద్ద సినిమాలను ‘పర్సంటేజ్’ (కలెక్షన్లలో వాటా) ప్రాతిపదికన మాత్రమే థియేటర్లలో ప్రదర్శించేలా నిర్ణయం తీసుకోవాలని ఎగ్జిబిటర్లు కోరనున్నారు. దీనివల్ల నిర్మాతలతో పాటు థియేటర్ల యాజమాన్యాలకు కూడా లబ్ధి చేకూరుతుందని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఫిక్స్‌డ్ రెంటల్’ విధానం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు భారీగా నష్టపోతున్నాయని అసోసియేషన్ ప్రతినిధులు మెగాస్టార్‌కు వివరించనున్నారు. సినిమా ఆడినా ఆడకపోయినా భారీ మొత్తంలో అద్దెలు చెల్లించాల్సి రావడం వల్ల ఎగ్జిబిటర్లు అప్పులపాలవుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Advertisement

Read also-Today Movies in TV : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి…

సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకం!

మల్టీప్లెక్స్‌ల హవా పెరిగిపోవడం, మరోవైపు ఓటీటీల ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి రోజురోజుకూ అత్యంత దయనీయంగా మారుతోంది. కరెంట్ బిల్లులు, థియేటర్ మెయింటెనెన్స్, సిబ్బంది జీతాలు కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో పెద్ద సినిమాల విడుదల సమయంలో అనుసరిస్తున్న కొన్ని విధానాలు తమను మరింత కుంగదీస్తున్నాయని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో అందరి క్షేమాన్ని కోరే మెగాస్టార్ చిరంజీవి ఈ సమస్యపై సానుకూలంగా స్పందిస్తారని, నిర్మాతల మండలితో మాట్లాడి ఎగ్జిబిటర్లకు న్యాయం జరిగేలా చూస్తారని అసోసియేషన్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. రేపు సాయంత్రం జరగబోయే ఈ హై-ప్రొఫైల్ సమావేశం అనంతరం టాలీవుడ్ ఎగ్జిబిషన్ సెక్టార్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×