E-Paper
Advertisement

Radio telescope : ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ప్రారంభం

Radio telescope : ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ప్రారంభం
Advertisement

Radio telescope : ది స్క్వేర్ కిలోమీటర్ అరే-ఎస్.కె.ఏ. అనేది ప్రపంచంలోనే అతి పెద్ద టెలిస్కోప్. దీని నిర్మాణం ఆస్ట్రేలియాలో మొదలైంది. అటు దక్షిణాఫ్రికాలోని కరూ ప్రాంతంలోనూ దీనికి సంబంధించిన పనులు కొనసాగుతాయి. అయితే ప్రధాన కార్యాలయం మాత్రం బ్రిటన్ లో ఉంది. 2028 నాటికి దీని నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలనేది టార్గెట్. ది స్క్వేర్ కిలోమీటర్ అరే ను 21వ శతాబ్దపు అతి పెద్ద సైన్స్ ప్రాజెక్టుల్లో ఒకటిగా అభివర్ణిస్తున్నారు సైంటిస్టులు. విశ్వంలో రహస్యాలను శాస్త్రవేత్తలు ఛేదిస్తున్నా… ఇంకా అంతుచిక్కని వాటికి లెక్కేలేదు. అంటే ఇప్పటిదాకా తెలిసినవి కొన్నే. మిగతా వాటి గురించి తెలుసుకోడానికి ది స్క్వేర్ కిలోమీటర్ అరే ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఐన్ స్టీన్ సిద్ధాంతాలను పరీక్షించడంతో సహా భూమిని పోలిన గ్రహాల కోసం విశ్వంలో అన్వేషిస్తారు. ది స్క్వేర్ కిలోమీటర్ అరే అనేది అతిపెద్ద ప్రాజెక్టు. దీనికోసం ఆస్ట్రేలియాలోని మార్చిసన్ ప్రాంతంలో అత్యధికంగా భూమిని కేటాయించారు. ఇందులో 74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు లక్షకుపైగా యాంటెన్నాలను నిర్మిస్తారు. ఇవన్నీ క్రిస్మస్ ట్రీలను పోలివుంటాయి. అటు దక్షిణాఫ్రికాలో 197 భారీ డిష్ లను ఏర్పాటు చేస్తారు. మొత్తంగా ఇది వరల్డ్ లోనే బిగ్గెస్ట్ రేడియో టెలిస్కోప్ అవుతుంది. ఇదో సుదీర్ఘమైన, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. దీనికి సంబంధించిన ఆలోచన 1990లో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 30 ఏళ్లు పట్టింది. కాన్సెప్ట్ , ఆలోచనలకు ఒక నిర్దష్ట రూపం ఇవ్వడానికి మొదటి పదేళ్లు పట్టింది. ఆ తర్వాత టెక్నాలజీ డెవలప్ మెంట్ కోసం మరో 10 ఏళ్లు పట్టింది. ఇక ప్రాజెక్టును వివరణాత్మకంగా డిజైన్ చేయడం, అవసరమైన భూమిని సేకరించడం, ప్రభుత్వాలను ఒప్పించడానికి… నిర్మాణం పూర్తి చేయడానికి మరో 10 ఏళ్లు గడిచిపోయాయి. మొత్తంగా ఈ అతిపెద్ద ప్రాజెక్టులో 16 దేశాలు భాగస్వాములవుతున్నాయి. వీటిలోకి ఎనిమిది దేశాలకు చెందిన సైంటిస్టులు ఈ టెలిస్కోప్ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. విశ్వం ఆవిర్భావానికి కారణమైన బిగ్ బ్యాంగ్ తర్వాత తొలినాళ్లలో ఏర్పడిన పరిస్థితుల గురించి తెలుసుకోడానికి ఈ అతి భారీ టెలిస్కాప్ అవసరమని సైంటిస్టులు అంటున్నారు. దీని నిర్మాణాన్ని మరో ఆరేళ్లలో పూర్తిచేసి 2028నాటికి అందుబాటులోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు. మరి దీని ద్వారా ఎలాంటి విశ్వరహస్యాలను ఛేదిస్తారో చూడాలి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×