E-Paper
Advertisement

Employees in 2023: ఉద్యోగులను నిండా ముంచుతున్న టెక్ కంపెనీలు

Employees in 2023: ఉద్యోగులను నిండా ముంచుతున్న టెక్ కంపెనీలు
Advertisement

Employees in 2023:టెక్నాలజీ రోజు రోజుకు విస్తరిస్తోంది. ఎన్నో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. కానీ వాటికి ప్రాణం పోసే ఉద్యోగులకే జాబ్ గ్యారంటీ లేకుండా పోయింది. లేఆఫ్స్ అంటూ భయపెడుతున్నాయి. ఉద్యోగం ఉంటుందో లేదోననే టెన్షన్ వెంటాడుతోంది. ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియదు. ఒకవైపు లేఆఫ్స్ భయం… మరోవైపు ఏదో సాధించాలనే తపన. వీటి మధ్య ఉద్యోగులు పడుతున్న మానసిక సంఘర్షణ అంతాఇంతా కాదు. మొన్నటిదాకా ఒకచోట ఉద్యోగం ఊడితే… మరో చోట వెతుక్కోవచ్చులే అనే ధీమా ఉండేది. కానీ ఇప్పుడది లేకుండా పోయింది. ఎలాన్ మస్క్ పుణ్యమా అని అందరూ వరుస పెట్టి ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారు. ఒకవైపు ఆర్థిక మాంద్యం భయం, మరోవైపు కరోనా పొంచివున్న కరోనా మహమ్మారితో ఎంప్లాయిస్ నరకాన్ని అనుభవిస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే అనేక సంస్థలు తీసేసిన ఉద్యోగుల సంఖ్య లక్ష దాటినట్లు సమాచారం. ఇక ఇన్నాళ్లు చాలా సేఫ్ అనుకున్న గూగుల్ కూడా కోత మొదలు పెడుతోంది. వచ్చే ఏడాది 6 శాతం ఉద్యోగులను రోడ్డున పడేయడానికి గూగుల్ రెడీ అవుతోంది. అటు అమెజాన్ కూడా లేఆఫ్స్ బాంబ్ పేల్చింది.
ఉద్యోగుల భారం దించుకోడానికి కంపెనీలు రకరకాల సాకులు వెతుకుతున్నాయి. కాస్ట్ కటింగ్ అనో… ఉద్యోగుల పనితీరు బాగోలేదనో చెబుతున్నాయి. కానీ ఉద్యోగుల పనితీరు బాగోలేదనడం మాత్రం కరెక్ట్ కాదంటారు ఎంప్లాయిస్. ఎందుకంటే దశలవారీగా ఇంటర్వ్యూలు పెట్టి సెలెక్ట్ చేసుకుంటారు. కొన్నేళ్లపాటు కంపెనీలో పనిచేసిన సీనియర్లను కూడా పనితీరు బాగోలేదనే నెపం నెట్టి ఇంటికి పంపించడమేంటనే ప్రశ్న వస్తోంది. నిజంగా పనితీరు సరిగా లేకపోతే ఇన్నాళ్లు ఎలా భరించారంటే సమాధనం ఉండదు.
గత వారం గూగుల్ తన ఉద్యోగులతో సమావేశం నిర్వహించింది. అందులో ఫుల్ టైమ్ ఉద్యోగుల్లో 6 శాతం మంది అంటే దాదాపు 10 వేల మంది పేలవమైన పనితీరు ప్రదర్శిస్తున్న లిస్ట్ లో ఉన్నట్లు గూగుల్ అంచనా వేసింది. 22 శాతం మంది ఎంప్లాయిస్ పనితీరు బాగుందని గూగుల్ నివేదిక వెల్లడించింది. మరికొందరు ఉద్యోగులు సంస్థ తెచ్చిన కొత్త వర్క్ కల్చర్ లో విధానపరమైన, సాంకేతిక సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నారని నివేదిక తెలిపింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×