E-Paper
Advertisement

COVID 19: తెలుగు రాష్ట్రాలపై కరోనా పంజా.. తెలంగాణలో మరో 6 కేసులు

COVID 19: తెలుగు రాష్ట్రాలపై కరోనా పంజా.. తెలంగాణలో మరో 6 కేసులు
Advertisement
Covid 19 cases update

Covid 19 cases update(Morning news today telugu) :

కరోనా వైరస్‌ మరోసారి కోరలు చాస్తోంది. మొన్నటివరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తోంది. తాజాగా ఏపీలోని ఏలూరులో కొవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. ప్రయివేట్‌ మెడికల్‌ కాలేజీ వైద్యుడికి కరోనా వైరస్‌ సోకింది. అయితే ఆ వేరియంట్‌ ఏంటో నిర్థారించేందుకు శాంపిల్స్‌ ను హైదాబాద్‌కు తీసుకొచ్చారు.

తెలంగాణలోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 24 గంటల్లో 925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 19కి చేరింది.

Advertisement

ఇక భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 2,997 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. క‌రోనా కేసులు మ‌ళ్లీ పెర‌గ‌డానికి కొత్త వేరియంట్ జేఎన్‌.1 కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

కేరళలోనూ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. 24గంటల్లో 265 కొత్త కేసులు నమోదు కాగా ఒక మరణం సంభవించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×