E-Paper
Advertisement

ఆలయం పైకప్పు కూలి ఐదుగురు మృతి, శిథిలాల కింద మరో 40 మంది.. మహారాష్ట్రలో ఘోర విషాదం

ఆలయం పైకప్పు కూలి ఐదుగురు మృతి, శిథిలాల కింద మరో 40 మంది.. మహారాష్ట్రలో ఘోర విషాదం
Advertisement

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యశ్వాడి మారుతి దేవాలయంలో నిర్మాణంలో ఉన్న సభా మండపం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రమాద సమయంలో సుమారు 30 నుండి 40 మంది భక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలిసింది.

శనివారం కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఆలయం ముందు భాగంలో నిర్మాణంలో ఉన్న మండపం వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడారు. అదే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర భయాందోళనలు, గందరగోళం నెలకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు భక్తులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే, మృతుల సంఖ్యకు సంబంధించి జిల్లా యంత్రాంగం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisement

శిథిలాల కింద చిక్కుకున్న భక్తులను రక్షించడానికి రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగం ఉన్నతాధికారులు, పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించడానికి అధికారులు పెద్ద సంఖ్యలో అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. శిథిలాలను తొలగించి, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Also Read: కొత్తగా ఏదైనా చేయాలంటూ.. ఉరేసుకున్న నీట్ విద్యార్థి.. ఖంగుతిన్న పోలీసులు!

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×