E-Paper
Advertisement

సిరియాలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, 35 మంది మృతి, 30 మందికి పైగానే గాయాలు

సిరియాలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, 35 మంది మృతి, 30 మందికి పైగానే గాయాలు
Advertisement

Two buses collided: రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో 35 మంది మృత్యువాతపడ్డారు. మరో డజను మందికి పైగానే గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత అక్కడి దృశ్యాలు భయానకంగా కనిపించారు.అసలు ఘటన ఎలా జరిగింది?

సిరియాలో ఘోర ప్రమాదం- సిరియాలోని తూర్పు-మధ్య ఎడారి ప్రాంతంలో అక్కడి కాలమానం ప్రకారం శనివారం రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 35 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రభుత్వ మీడియా తెలిపింది. డమాస్కస్-డెయిర్ ఎజోర్ రహదారిపై ఈ ఘటన జరిగింది. రెండు బస్సుల్లో దాదాపు 35 మంది చనిపోయారు. మరో 30 మంది గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement

రెండు బస్సులు ఢీ, 35 మంది మృతి- రెండు బస్సులు ఢీ కొన్న వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఊపిరి ఆడకపోవడంతో ఎక్కువ మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. రహదారి పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న శిథిలాల కనిపించాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్సు అక్కడికి చేరుకున్నాయి. దాదాపు 30 మంది వరకు గాయపడ్డారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

30 మందికి పైగానే గాయాలు- ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం విషయం తెలియగానే బాధితుల బంధువులు ఆసుపత్రికి చేరుకుని ఆరా తీస్తున్నారు.  అతి వేగమే ఆ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానిక  అధికారులు వెల్లడించారు.

Advertisement

ఈనెల ఆరంభంలో దక్షిణ సిరియాలోని ఓ ప్రావిన్స్‌లో మరో ప్రమాదం జరిగింది.  సౌదీ అరేబియా నుండి యాత్రికులతో కూడిన బస్సు బోల్తా  పడింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, డజన్ల కొద్దీ ప్రయాణికులు గాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువ మంది లెబనీయులు ఉన్నారు.

ALSO READ: కెనడాలోనూ ఉన్మాదమే.. ప్రేయసిని చంపిన ఇండియన్ ప్రియుడు.. ఏం జరిగిందంటే?

సంవత్సరాల సిరియా అంతర్యుద్ధం జరిగింది. వచ్చిన పాలకులు తమ సీట్లను కాపాడుకునే ప్రయత్నంలో అభివృద్ధిని నీరుగార్చారు. ఫలితంగా గతంలో ఉన్న మౌలిక సదుపాయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అనేక రహదారులకు డ్యామేజ్ అయ్యాయి, మరమ్మతులు చేయకపోవడంతో ప్రమాదాలు అక్కడ సామాన్యంగా మారిపోయాయి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×