E-Paper
Advertisement

ట్రంప్ నోటిదూల.. ఎందుకింత అహంకారం.. భారత్ ఓ నరకమంటూ సంచలన పోస్ట్

ట్రంప్ నోటిదూల.. ఎందుకింత అహంకారం.. భారత్ ఓ నరకమంటూ సంచలన పోస్ట్
Advertisement

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అహంకారాన్ని ప్రదర్శించారు. భారతీయ ఐటీ నిపుణులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది.  ప్రముఖ అమెరికన్ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన జాత్యహంకార లేఖను ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా రీపోస్టు చేయడమే ఈ వివాదానికి కేంద్రబిందువైంది.

మైఖేల్ సావేజ్ తన లేఖలో భారత్ చైనాలను అత్యంత నీచంగా నరక కూపాలు అని అభివర్ణించారు. ఆయా దేశాల నుంచి మహిళలు కేవలం అమెరికా పౌరసత్వం కోసమే గర్భం దాల్చిన తొమ్మిదో నెలలో ఇక్కడికి వస్తారని ఆరోపించారు. అలా జన్మించిన బిడ్డకు పౌరసత్వం లభించగానే వారి కుటుంబ సభ్యులందరినీ భారత్ వంటి నరకం నుంచి అమెరికాకు తీసుకొస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ చట్టాలను మార్చాలనే డిమాండ్‌ను సమర్థిస్తూ ట్రంప్ ఈ లేఖను పంచుకోవడం గమనార్హం.

Advertisement

మన దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్న ఐటీ నిపుణులపై కూడా సావేజ్ విషం చిమ్మారు. భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను ‘గ్యాంగ్‌స్టర్స్ ఆఫ్ లాప్‌టాప్స్’ అంటూ అవమానించారు. మేధోశక్తితో ప్రపంచాన్ని శాసిస్తున్న భారతీయులను గ్యాంగ్‌స్టర్లతో పోల్చడం పట్ల ప్రవాస భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జన్మతః పౌరసత్వం (Birthright Citizenship) అనే అంశాన్ని ఆయుధంగా చేసుకుని ఆసియా దేశాల ప్రజలపై జాత్యహంకార దాడికి దిగడం హాట్ టాపిక్ గా మారింది.

జన్మతః పౌరసత్వం విషయంలో ట్రంప్ చేస్తున్న వాదనలో అసలు వాస్తవం లేదని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశమూ ఇలాంటి హక్కు కల్పించడం లేదని ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలు అబద్ధమని తేలింది. కెనడా మెక్సికో సహా దాదాపు 30కి పైగా దేశాలు ప్రస్తుతం ఈ పౌరసత్వ హక్కును అందిస్తున్నాయి. వాస్తవాలను పక్కనబెట్టి కేవలం ఎన్నికల లబ్ధి కోసమే ట్రంప్ ఇలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

Advertisement

గతంలో కూడా భారత్‌ను ‘డెడ్ ఎకానమీ’ అంటూ ట్రంప్ హేళన చేశారు. ఆ వ్యాఖ్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా దూసుకుపోతోందని ప్రధాని స్పష్టం చేశారు. ఒకవైపు భారత్‌తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నట్లు నటిస్తూనే మరోవైపు ఇలాంటి విద్వేషపూరిత పోస్టులను ప్రోత్సహించడం ట్రంప్ ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది.

అమెరికాలో స్థిరపడిన భారతీయులు ఆ దేశ ఆర్థిక పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అటువంటి వారిని ఉద్దేశించి ‘నరకం నుంచి వచ్చారు’ అనడం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. మైఖేల్ సావేజ్ వంటి వారు చేసే విద్వేష ప్రసంగాలకు మాజీ అధ్యక్షుడే ప్రచారం కల్పించడం అమెరికాలో పెరుగుతున్న జాత్యహంకారానికి అద్దం పడుతోంది. ఈ తాజా వివాదం భారత్ అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

ALSO READ: బ్రీత్ అనలైజర్ ఊదను.. ఏం చేసుకుంటారో చేసుకోండి! హైదరాబాద్‌లో యువతి రచ్చ

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×