E-Paper
Advertisement

IBM: 3900 మంది ఉద్యోగులకు ఐబీఎం గుడ్‌బై

IBM: 3900 మంది ఉద్యోగులకు ఐబీఎం గుడ్‌బై
Advertisement

IBM: ఐటీ రంగంలో ఆర్థిక మాంద్యం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతి రోజూ వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. దిగ్గజ కంపెనీలు సైతం మాంద్యం దెబ్బకు తట్టుకోలేక పోతున్నాయి. ఇప్పటికే పలు మల్టీ నేషనల్ కంపెనీలు ఉద్యోగులను తొలగించగా.. మరికొన్ని కంపెనీలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికి రెడీగా ఉన్నాయి. తాజాగా టెక్ దిగ్గజం ఐబీఎం కూడా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.

మొత్తం ఉద్యోగుల్లో 1.5 శాతం మందిని అంటే 3900 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపనున్నట్లు వెల్లడించింది. లక్ష్యాలు తగ్గడంతో పాటు కొన్ని అసెట్ డివెస్ట్‌మెంట్ల కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొంది. తొలగింపులు అన్ని విభాగాల్లో ఉంటాయని తెలిపింది. అలాగే క్లయింట్ ఫేసింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాల్లో నియామకాలు కొనసాగిస్తామని వెల్లడించింది.

Advertisement

ఇప్పటికే మాంద్యం దెబ్బకు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్, ట్విట్టర్ వంటి కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×