E-Paper
Advertisement

రెండు భారీ భూకంపాలు.. చిగురుటాకులా వణికిన వెనిజులా, కూలిన ఎత్తైన భవనాలు, మృతులు లక్ష వరకు..

రెండు భారీ భూకంపాలు.. చిగురుటాకులా వణికిన వెనిజులా, కూలిన ఎత్తైన భవనాలు, మృతులు లక్ష వరకు..
Advertisement

Venezuela: ప్రకృతి కన్నెర్ర జేసింది. దక్షిణ అమెరికాలోని వెనిజులాలో రెండు భారీ భూకంపాలు వణికించాయి. దాని ఫలితంగా ఆ దేశ రాజధాని కారకాస్‌ చిగురుటాకులా వణికిపోయింది. భూకంపం తీవ్రతకు ఎతైన భవనాలు ఊగిపోయాయి. భవనాల్లోని ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు.

వెనిజులాను వణికించిన రెండు భారీ భూకంపాలు

Advertisement

వెనిజులాలో బుధవారం సాయంత్రం రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఒకదాని తర్వాత మరొకటి రావడంతో దేశ రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. భూకంపం ధాటికి కారకాస్‌లోని ఎత్తైన భవనాలు, ఇళ్లు నేల కూలాయి.

అమెరికా జియోలాజికల్ సర్వే నివేదిక మేరకు.. వెనిజులా కాలమాన ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత వరుస భూకంపాలు సంభవించాయి. కారకాస్‌కు పశ్చిమాన మొరాన్ తీరప్రాంతం సమీపంలో తొలి భూకంపం సంభవించింది. ఇది భూమిలోని 13 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్టు తెలిపింది.

Advertisement

చిగురుటాకులా వణికిన రాజధాని కారకాస్.. కూలిన ఎత్తైన భవనాలు

రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో వచ్చినట్టు పేర్కొంది. తొలి భూకంపం వచ్చిన అర నిమిషం తర్వాత అత్యంత శక్తివంతమైన మరొక భూకంపం సంభవించింది. ఇది రెక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో నమోదు అయ్యింది. ఇది మొరాన్‌కు నైరుతి దిశగా భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో నమోదు అయినట్టు వెల్లడించింది. 125 ఏళ్ల వెనెజులా చరిత్రలో అత్యంత బలమైన భూకంపాల్లో ఒకటిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రాజధాని కారకాస్‌లో ఊగిపోతున్న భవనాల నుండి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. భవనాలు గోడలు పేకమేడల్లా ఒక్కసారిగా కూలిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రకృతి కన్నెర్రను అక్కడి ప్రజలు వీధుల్లోకి వచ్చి మరీ చూశారు. వరుస భూకంపాల ప్రభావం కారకాస్‌పై తీవ్ర ప్రభావం చూపిందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఎటు చూసినా కూలిన భవనాలు కనిపించాయి.

ALSO READ: నిప్పులకుంపటిలా ఆకాశం.. ఫ్రాన్స్‌ను చుట్టేసిన ‘ఓమేగా బ్లాక్’.. 40 మంది మృతి 

కారకాస్ సిటీలో ఎటుచూసినా శిథిలమైన భవనాలు, ఇళ్లు, షాపులు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల భవనాల గోడలు కూలిపోయి లోపల ఫర్నిచర్ అంతా కనిపించాయి. ఫలితంగా కారకాస్ సిటీలో విద్యుత్, ఇంటర్నెట్ వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని ఆదేశం అంచనా వేస్తోంది.

ట్రుజిల్లో, యారాకుయ్, కారబోబో, మిరాండా, అరగువా, లా గుయిరాతో సహా రాష్ట్రాలను భూకంపాలు ప్రభావితం చేశాయని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారం మృతుల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకు ఉండే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. మరోవైపు గురువారం ఉదయం జపాన్‌లో ఇవతే తీరంలో భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై 6.9గా నమోదు అయ్యింది. అయితే జపాన్‌లో సునామీ ముప్పు లేదని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×