E-Paper
Advertisement

Jaishankar : డిజిటల్ చెల్లింపుల్లో భాారత్ సరికొత్త రికార్డ్.. కొవిడ్ సమయంలో భారత్ కృషి అద్భుతం..

Jaishankar : డిజిటల్ చెల్లింపుల్లో భాారత్ సరికొత్త రికార్డ్..  కొవిడ్ సమయంలో భారత్ కృషి అద్భుతం..
Advertisement

Jaishankar : నగదు రహిత చెల్లింపుల్లో భారత్‌ అమెరికాను అధిగమించిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ ప్రకటించారు. అమెరికాలో మూడేళ్లలో జరిగే చెల్లింపులు మనదేశంలో ఒక నెలలో జరుగుతాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం జై శంకర్ నైజీరియా పర్యటనలో ఉన్నారు. అక్కడ ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు తయారీలో చేసిన కృషి వివరించారు. టెక్నాలజీని భారతీయులు అందిపుచ్చుకోవడంతో భారతీయుల జీవన విధానం సులభంగా మారిందన్నారు. దేశంలో అతి తక్కువ మంది మాత్రమే నగదు చెల్లింపులు చేస్తున్నారని ఆయన తెలిపారు. భారత్‌లో ఒక నెలలో జరిగిన నగదు రహిత చెల్లింపులు అమెరికాలో మూడేళ్లలో జరుగుతున్నాయని ప్రకటించారు.

పశ్చిమ ఆఫ్రికా మిషన్‌లో భాగంగా జైశంకర్‌ ఉగాండా, నైజీరియాల్లో పర్యటిస్తున్నారు. భారత్‌-నైజీరియాల మధ్య సహాయ సహకారాలపై అక్కడి పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చించారు. అంతకుముందు పశ్చిమ ఆఫ్రికాలోని భారత రాయబారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ ఆర్ధిక వ్యవస్థ కోసం ప్రసంగించారు. ప్రపంచంలోనే బలమైన ఆర్ధిక వ్యవస్థగా భారత్ వేగంగా వృద్థి చెందుతుందని పేర్కొన్నారు. గతంతో పోల్చుకుంటే భారత్ లో రవాణా వ్యవస్థ, మౌలిక సదుపాయలు మెరుగవుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో కొవిడ్ అల్లకల్లోలం సృష్టించిందని.. అదే సమయంలో భారత్ ప్రపంచానికి వ్యాక్సిన్లు అందించే స్థాయికి వెళ్ళిందని ఆయన గుర్తుచేశారు. పశ్చిమ ఆఫ్రికా మిషన్‌లో భాగంగా ఉగాండా, నైజీరియాల్లో జైశంకర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్ – నైజీరియాల మధ్య వ్యాపార ఒప్పందాలు, సహాయ సహకారాలపై పారిశ్రామిక వేత్తలతో జై శంకర్ చర్చించారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×